దివంగత ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో తొలిసారిగా దాయాధి పాకిస్థాన్ తో జరిగిన యుద్దంలో భారత్ విజయకేతనం ఎగురువేసింది. అంతర్జాతీయ దేశాలు, ఐక్యరాజ్యసమితి సహా పలు దేశాలు ఈ యుద్దంపై ఆంక్షలు పెట్టినా.. జరుగుతున్న యుద్దాన్ని అపలేమని.. విజయం ఎవరివైపున వుందన్న విషయం పూర్తిగా ప్రపంచానికి తెలియాల్సిన అవసరం వుందని చాటిచెప్పిన ఇంధిరాగాంధీ పాకిస్థాన్ పై విజయకేతనం ఎగురువేశారు. అందుకు భారత సైన్యం కూడా రెట్టింపు ఉత్సాహంతో ముందుకెళ్లింది. అంతకుముందు రెండు పర్యాయాలు యుద్దం జరిగినా.. ప్రపంచదేశాల వినతుల నేపథ్యంలో భారత్ మధ్యలోనే విరమించుకుంది. అయినా పాకిస్థాన్ తన మేకపోతు గంభీర్యాన్ని నిత్యం భారత్ పై ప్రదర్శిస్తూనే మరోమారు కయ్యానికి కాలుదువ్వింది.
దీంతో 1971లో పాకిస్థాన్ పై యుద్దన్ని ప్రకటించిన భారత్.. ప్రపంచ దేశాల నుంచి అభ్యంతరాలు, విన్నతులు వెల్లువెత్తినా.. యుద్దాన్ని కోనసాగించి విజయాన్ని అందుకుంది. దీంతో 1971 నాటి యుద్దంలో దేశం కోసం ప్రాణాలర్పించి అమరులైన జవాన్ల గౌరవార్థం ఇవాళ విజయ్ దివస్ ను జరుపుకుంటున్నారు, సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) జవాన్లు విజయ్ దివస్ సందర్భంగా వినూత్నంగా అమరజవాన్లకు అంజలి ఘటించారు. దాదాపు 930 మంది జవాన్లు ఈ వినూత్న కార్యక్రమంలో పాల్గోన్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 930 మంది జవాన్లు విజయ్ దివస్ వేడుకలను పురస్కరించుకుని ఏకంగా 180 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 11 గంటల వ్యవధిలో పరిగెత్తి వారికి ఘననివాళులు అర్పించారు.
రాజస్థాన్ లోని బికనేర్ సమీపంలో దేశ సరిహద్దు వెంట ప్రారంభమైన ఈ రన్నింగ్ ర్యాలీ.. రాజస్థాలోని అనూప్ గడ్ వద్ద ముగిసింది. ఈ 180 కిలోమీటర్ల పోడువునా బీఎస్ఎఫ్ అధికారులు జవాన్లకు దేశభక్తి గీతాలను వినిపిస్తూ ఉత్తేజపర్చారు. మొత్తం 930 మంది బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ జవాన్లు ఒక్కోక్కరు ఏకంగా 500 నుంచి 600 మీటర్ల మేర విజయానికి చిహ్నంగా వెలుగుతూ వుండే టార్చ్ ను పట్టుకుని పరుగితెత్తారు. ఇందుకు సంబంధించిన వీడియోను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తన ట్విట్టర్ ఖాతాలో విడుదల చేశారు. 1971లో పాకిస్థాన్ పై యుద్ధంలో సాధించిన విజయానికి గుర్తుగా, డిసెంబర్ 16న విజయ్ దివస్ నిర్వహిస్తారు. పాక్ ఓటమి తరువాతే తూర్పు పాకిస్థాన్ విడిపోయి బంగ్లాదేశ్ గా మారింది.
BSF honoured the war heroes of 1971 war today in style! 180 km baton relay race was run by 930 BSF boys and girls in the mid night at international border and completed in less then 11 hours. pic.twitter.com/EeBZ5V16aQ
— Kiren Rijiju (@KirenRijiju) December 14, 2020
(And get your daily news straight to your inbox)
Apr 03 | ఉత్తరప్రదేశ్ లో జరగనున్న పంచాయతీ ఎన్నికలు ఈసారి గ్లామరెస్ గా మారనున్నాయి. తాను పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఫెమినా మిస్ ఇండియా -2015 రన్నరప్ దీక్షాసింగ్ ప్రకటించింది. జౌన్ పూర్ జిల్లా బక్షా... Read more
Apr 03 | ఎనబై ఏళ్లకు పైబడిన వయస్సులోనూ అమె తన జీవనం కోసం అలోచించకుండా పది మంది కడుపు నింపే పనికి పూనుకున్నారు. అందరూ తన బిడ్డల లాంటి వారేనని, అమె అందరికీ అందుబాటు ధరలోనే ఇడ్లీలు... Read more
Apr 03 | బెంగళూరు డ్రగ్స్ కేసు..శాండిల్ వుడ్ పరిశ్రమను షేక్ చేసి అక్కడి ప్రముఖులను ఊచలు లెక్కపెట్టించిన కేసుకు సంబంధించిన లింకులు తెలంగాణలోనూ బయటపడ్డాయి. ఆ మధ్య పలువురు నటుల చు్ట్టూ తిరిగిన ఈ కేసులో వారి... Read more
Apr 03 | అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న అసోంలో బీజేపీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. అసోం బీజేపి ప్రతినిధిగా ముఖ్యమంత్రి సోనూవాల్ ను అధిగమించి మరీ దూసుకుపోతున్న రాష్ట్ర మంత్రి హిమంత విశ్వశర్మపై చర్యలు తీసుకున్నఎన్నికల కమీషన్... Read more
Apr 03 | తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అంకానికి మరికొన్ని గంటల వ్యవధిలో తెరపడుతుందన్న తరుణంలో రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు, అరోపణలు ఊపందుకుంటున్నాయి. మరీముఖ్యంగా బీజేపిని టార్గెట్ చేస్తున్న ప్రతిపక్ష పార్టీ డీఎంకే అధినేత... Read more