కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు నూతన వ్యవసాయ బిల్లులను బేషరుతుగా ఉపసంహరించుకోవాలని హస్తినలో అందోళన బాట పట్టిన రైతన్న ఇక నిరాహారదీక్షకు పిలుపునిచ్చి.. ఉద్యమాన్ని ఉదృతం చేస్తున్న క్రమంలో అటు కేంద్రం కూడా చర్చోపచర్చలు కొనసాగిస్తోంది. ఇప్పటికే ఆర్ఎస్ఎస్ అనుబంధ స్వదేశీ జాగరణ్ మంచ్ (ఎస్జేఎం) కూడా పలు సవరణలు చేయాలని తమ పార్లమెంటు సభ్యులను కోరింది. కేంద్రం నూతన వ్యవసాయ చట్టలాను తీసుకురావడంలో అవశ్యకత ఏమిటో వివరిస్తూ.. చట్టాలలో వున్న పలు లోపాలను సవరిస్తూ సవరణలు చేయాల్సిన అవసరం వుందని అభిప్రాయపడింది. రైతులకు కనీస మద్దతు ధర నిర్ణయించాల్సిన అవసరం వుందని పేర్కోంది.
ఇక ఇవాళ రైతు సంఘాలు తమ 19వ రోజున ఒక్కరోజు నిరాహార దీక్షకు పూనుకోవడంలో దేశవ్యాప్తంగా ఉద్యమకారులు ఎక్కడికక్కడ ధర్నాలు, నిరాహార దీక్షలు చేపట్టారు. మరీ ముఖ్యంగా జిల్లా కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేపట్టారు. ఇక రైతుల అందోళనలు ప్రభుత్వానికి శరాఘాతంలా పరిణమించిన క్రమంలో కేంద్ర వ్వవసాయ శాఖా మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఇవాళ ఉదయం కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి భవిష్యత్ ప్రణాళికపై చర్చించారు. రైతుల ఉద్యమాన్ని విరమించాలని అయితే వారితో తదుపరి చర్చలు ఎప్పుడు నిర్వహించాలన్న దానిపై తాము చర్చించామని ఆయన తెలిపారు. రైతుసంఘాల ప్రతినిధులతో కేంద్రప్రభుత్వం చర్యలకు ఎల్లప్పుడూ సిద్దంగా వుందని అన్నారు.
అయితే రైతు సంఘాలే చర్చలు ఎప్పుడు నిర్వహించాలన్న దానిపై నిర్ణయించుకోవాలని ఆయన అన్నారు. ఇప్పటికే కేంద్రప్రభుత్వం అన్ని అంశాలపై రైతు సంఘాలకు పలు ప్రతిపాదనలు పంపిందని, అయితే వాటిపై క్లాజ్ టు క్లాట్ అధ్యయనం చేసిన తరువాత రైతు సంఘాలు చర్చలకు రావాలని ఆయన కోరారు. దీంతో చర్చల్లో క్లాజ్ ల ప్రకారం చర్చ జరగాల్సిన అవశ్యకత వుందని ఆయన అన్నారు. ఇప్పటికే తమ ప్రతిపాదనలను రైతు సంఘాలకు అందజేశామని, ఇక రైతు సంఘాలే వీటిపై పునరాలోచన చేసి.. ఎప్పుడు చర్చలు నిర్వహించేది కేంద్రప్రభుత్వానికి తెలపాల్సిన అవసరం వుందని అన్నారు. కాగా చత్తిస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేఫ్ భాగేల్ మాత్రం రైతులు 22 అంశాలలో సవరణలు చేయాలంటే కేంద్రం మాత్రం కేవలం రెండు అంశాల గురించే మాట్లాడుతుందని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more