కరోనా మహమ్మారి విజృంభనతో భయాందోళనకు గురైన దేశవాసులలో టీకా వస్తుందన్న ఆశలు అంధోళనలను దూరం చేస్తున్నా.. అప్పటివరకు మాత్రం జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందే. అన్ని వర్గాల ప్రజలు ఈ జాగ్రత్తలను పాటిస్తూనే వాక్సీన్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ముఖ్యంగా ప్రయాణాలు చేసేవాళ్లు కూడా అనునిత్యం జాగ్రత్త చర్యలు పాటిస్తున్నారు, ఇప్పటికే అన్ లాక్ 5.0 నిబంధనల పోడగింపు కూడా పూర్తికావడంతో రమారమి జనజీవనం పూర్తిగా యధతధస్థితికి చేరుకుంది. ఈ క్రమంలో సెకండ్ వేవ్ వస్తుందంటూ అందోళనలు విస్తృతం కావడంలో మళ్లీ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు, ఈ క్రమంలో వాక్సీన్ వచ్చేంతవరకు ప్రజలందరూ జాగ్రత్తగా వుండాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్నాయి.
శీతాకాంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ (రెండో తాకిడి) తప్పదంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే శీతల దేశాల్లో ఈ తాకిడి కూడా ప్రారంభమైంది. ఇటు దేశరాజధాని ఢిల్లీలోనూ కరోనా సెకండ్ వేవ్ తాకిడి మొదలైందని వార్తలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. ఈ ఏడాది న్యూఇయర్ వేడుకలకు పలు రాష్ట్రాలు దూరంగా వుండనున్నాయి. రాష్ట్రాలతో పాటు రాష్ట్ర ప్రజలు కూడా ఈ వేడుకలకు దూరంగా వుండాలని ప్రభుత్వాలు అదేశిస్తున్నాయి. మరీ ముఖ్యంగా అర్థరాత్రి వేడుకలపై పలు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి, లేట్ నైట్ పార్టీలు, వేడుకలకు దూరంగా ఉంచేందుకు పలు ప్రభుత్వాలు కర్ఫ్యూను సైతం అమలు చేస్తున్నాయి.
ఈ ఆంక్షలు ఆంధ్రప్రదేశ్ లోనూ అమలు జరగనున్నాయి. 2021 నూతన సంవత్సరాన్ని ఏపీ ప్రభుత్వం కూడా కర్ప్యూతో ఆహ్వానించనుంది. ఈ మేరకు రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. నూతన సంవత్సర వేడుకలు రద్దు చేయాలని నిర్ణయించుకుంది. ఈ నెల 26 నుంచి జనవరి 1 వరకు అన్నిరకాల వేడుకలు రద్దు చేసింది. ముఖ్యంగా, కొత్త సంవత్సరాది నేపథ్యంలో డిసెంబరు 31, జనవరి 1న వేడుకలు జరపరాదని స్పష్టం చేసింది. ఈ రెండ్రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా కర్ఫ్యూ తరహా ఆంక్షలు అమలు చేయనున్నారు. రాష్ట్రంలో వైన్ షాపులు, బార్లు తెరిచి ఉంచే వేళలను కూడా కుదించనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం గణనీయంగా తగ్గినా, జనవరి 15 నుంచి మార్చి 15 మధ్యలో కరోనా మరోసారి ప్రజ్వరిల్లే అవకాశం ఉందని కేంద్రం వైద్య సంస్థలు హెచ్చరించిన నేపథ్యంలో రాష్ట్ర సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more