గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో బీజేపి నగరంలోని అత్యధిక డివిజన్లలో తన ఆధిపత్యాన్ని చాటుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు అండగా లేదన్న విషయం స్పష్టంగా వెల్లడైంది. తెలంగాణ సర్కారుపై ఉద్యోగి కన్నెర్ర చేశాడన్న విషయం గత రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలోనూ తేలింది. కాగా, ఈ సారి ఉద్యోగులు రమారమి ఎన్నికలపై నిర్లిప్తత ప్రదర్శించారని కూడా తేలింది. ఈ సారి ఏకంగా 27 వేల మంది ఉద్యోగులు ఎన్నికల విధుల్లో హాజరవుతుండగా, వారిలో కేవలం 2000 లోపు ఉద్యోగులు మాత్రమే పోస్టల్ బ్యాలెట్ హక్కును వినియోగించుకున్నారని సమాచారం. నగర బల్దియా పీఠంపై మళ్లీ టీఆర్ఎస్ జెండా ఎగురుతుందనే భావనతోనే వారు ఈ మేర నిర్లప్తత ప్రదర్శించినట్టు తెలుస్తోంది.
ఇక రాజధాని నగరంలో పోలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో తమ ఓటు హక్కును వినియోగించుకున్న పలువురు ఉద్యోగులు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఓటు వేసారు. ప్రస్తుతతం అందుబాటులో వున్న సమాచారం మేరకు నగరంలోని మొత్తం అందుబాటులో ఉన్న ట్రెండ్స్ ప్రకారం, భారతీయ జనతా పార్టీ 82 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, టీఆర్ఎస్ 31 స్థానాల్లో, ఎంఐఎం 16, కాంగ్రెస్ 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఎంఐఎంకు గట్టి పట్టున్న పాతబస్తీలో సైతం పోస్టల్ బ్యాలెట్ లో పలు చోట్ల బీజేపీ ఆధిక్యంలో ఉండటంతో ఫలితాల సరళిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇక ఈ ఫలితాలపై స్పందించిన టీఆర్ఎస్ నాయకులు ఉద్యోగులకు తాము కొంత దూరాన్ని పాటిస్తున్నామన్న విషయాన్ని అంగీకరిస్తూ.. ఇకపై వారిని కూడా కలుపుకుని నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేస్తున్నారు.
కాగా ఈ ఫలితాలపై బీజేపి ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందిస్తూ.. ఇదే ఫలితాలు రాత్రి వరకు కోనసాగుతాయని, బల్దియా పీఠంపై బీజేపి జెండా రెపరెపలాడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ స్పందిస్తూ తెలంగాణ రాష్ట్రంలో మార్పు ప్రారంభమైందని, రానున్న అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికలలో అత్యధిక స్థానాలను కైవసం చేసుకునేందుకు క్షేత్రస్థాయిలో మూలాలను జీహెచ్ఎంసీ ఎన్నికలతో బలపర్చుకున్నామని అన్నారు. ఇకపై జరగనున్న ప్రతీ ఎన్నికలలోనూ విజయాన్ని సాధించి ప్రధాని నరేంద్రమోడీకి కానుకగా అందించేందుకు ప్రతీ బీజేపి కార్యకర్తలో ఉత్సాహాం రెట్టింపు అవుతుందన్నారు. దేశంలోని అనేక రాష్ట్రాలలో ప్రజలతో తెలంగాణ ప్రజలు కూడా మార్పును కోరుకుంటున్నారని, అయితే పూర్తి ఫలితాలు వెలువడిన తరువాత స్పష్టమైన సందేశం వస్తుందని అరవింద్ అన్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 18 | తెలంగాణ సీఎం కేసీఆర్ సమీప బంధువుల కిడ్నాప్ కేసులో అరెస్టయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు సికింద్రాబాద్ కోర్టులో మరోమారు పరాభవం ఎదురైంది. తనకు బెయిల్ మంజూరు చేయాలని అమె తరపున... Read more
Jan 18 | ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల నగరా మ్రోగిన నేపథ్యంలో ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నికల కమీషన్ మ్రోగించిందని వార్తలు గుప్పుమంటున్నాయి, ఓ వైపు రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నాలుగు దశల్లో ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్డును... Read more
Jan 18 | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు తెలుగు ప్రజల ఇలవేల్పుగా కొంగుబంగారమైన విషయం తెలిసిందే. కాగా, తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకునేందుకు ముందు భక్తులు ముందుగా వరహామూర్తి దేవాలయంలో ఆయన దర్శనం చేసుకోవాలన్న నానుడి... Read more
Jan 18 | మహారాష్ట్రలో ఒంటరిగా అధికారంలోకి రావడానికి ప్రస్తుతం అపసోపాలు పడుతున్న శివసేన పార్టీ.. త్వరలోనే జాతీయ పార్టీగా మాత్రం ఎదగాలని యోచనలో వుంది. అందుకు అనుగూణంగా పలు రాష్ట్రాలలో తమ సత్తాను చాటాలని ఉవ్విళ్లూరుతుంది. మహారాష్ట్రలోని... Read more
Jan 18 | కోటి రూపాయాల లంచం డిమాండ్ చేసిన రైల్వే సీనియర్ అధికారిని సీబీఐ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అరెస్టు చేసింది. ప్రభుత్వ ఉద్యోగిగా కొనసాగుతూ ఇంతటి భారీ మోత్తాన్ని లంచంగా డిమాండ్ చేసి అడ్డంగా... Read more