గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో బీజేపి నగరంలోని అత్యధిక డివిజన్లలో తన ఆధిపత్యాన్ని చాటుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు అండగా లేదన్న విషయం స్పష్టంగా వెల్లడైంది. తెలంగాణ సర్కారుపై ఉద్యోగి కన్నెర్ర చేశాడన్న విషయం గత రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలోనూ తేలింది. కాగా, ఈ సారి ఉద్యోగులు రమారమి ఎన్నికలపై నిర్లిప్తత ప్రదర్శించారని కూడా తేలింది. ఈ సారి ఏకంగా 27 వేల మంది ఉద్యోగులు ఎన్నికల విధుల్లో హాజరవుతుండగా, వారిలో కేవలం 2000 లోపు ఉద్యోగులు మాత్రమే పోస్టల్ బ్యాలెట్ హక్కును వినియోగించుకున్నారని సమాచారం. నగర బల్దియా పీఠంపై మళ్లీ టీఆర్ఎస్ జెండా ఎగురుతుందనే భావనతోనే వారు ఈ మేర నిర్లప్తత ప్రదర్శించినట్టు తెలుస్తోంది.
ఇక రాజధాని నగరంలో పోలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో తమ ఓటు హక్కును వినియోగించుకున్న పలువురు ఉద్యోగులు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఓటు వేసారు. ప్రస్తుతతం అందుబాటులో వున్న సమాచారం మేరకు నగరంలోని మొత్తం అందుబాటులో ఉన్న ట్రెండ్స్ ప్రకారం, భారతీయ జనతా పార్టీ 82 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, టీఆర్ఎస్ 31 స్థానాల్లో, ఎంఐఎం 16, కాంగ్రెస్ 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఎంఐఎంకు గట్టి పట్టున్న పాతబస్తీలో సైతం పోస్టల్ బ్యాలెట్ లో పలు చోట్ల బీజేపీ ఆధిక్యంలో ఉండటంతో ఫలితాల సరళిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇక ఈ ఫలితాలపై స్పందించిన టీఆర్ఎస్ నాయకులు ఉద్యోగులకు తాము కొంత దూరాన్ని పాటిస్తున్నామన్న విషయాన్ని అంగీకరిస్తూ.. ఇకపై వారిని కూడా కలుపుకుని నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేస్తున్నారు.
కాగా ఈ ఫలితాలపై బీజేపి ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందిస్తూ.. ఇదే ఫలితాలు రాత్రి వరకు కోనసాగుతాయని, బల్దియా పీఠంపై బీజేపి జెండా రెపరెపలాడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ స్పందిస్తూ తెలంగాణ రాష్ట్రంలో మార్పు ప్రారంభమైందని, రానున్న అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికలలో అత్యధిక స్థానాలను కైవసం చేసుకునేందుకు క్షేత్రస్థాయిలో మూలాలను జీహెచ్ఎంసీ ఎన్నికలతో బలపర్చుకున్నామని అన్నారు. ఇకపై జరగనున్న ప్రతీ ఎన్నికలలోనూ విజయాన్ని సాధించి ప్రధాని నరేంద్రమోడీకి కానుకగా అందించేందుకు ప్రతీ బీజేపి కార్యకర్తలో ఉత్సాహాం రెట్టింపు అవుతుందన్నారు. దేశంలోని అనేక రాష్ట్రాలలో ప్రజలతో తెలంగాణ ప్రజలు కూడా మార్పును కోరుకుంటున్నారని, అయితే పూర్తి ఫలితాలు వెలువడిన తరువాత స్పష్టమైన సందేశం వస్తుందని అరవింద్ అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more