GHMC elections: BJP leads in postal votes జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు: పోస్టల్ బ్యాలెట్ లో బీజేపికే మొగ్గు

Ghmc election results bjp leads in 82 wards trs in 31

ghmc polls, ghmc elections 2020, ghmc elections 2020, ghmc elections results, ghmc election results, ghmc election results 2020, ghmc election results live, hyderabad election, hyderabad election results, hyderabad election results 2020, hyderabad municipal election results, hyderabad municipal election results 2020, hyderabad ghmc election results 2020, hyderabad municipal corporation election results 2020, ghmc polls results, ghmc polls results 2020, ghmc civic polls, ghmc civic polls results, ghmc civic polls results 2020, Telangana, Politics

The BJP took an early lead in the Greater Hyderabad Municipal Corporation elections on Friday, leading in 85 of the 150 seats, in initial trends. The ruling TRS was up in 29 seats, while Asaduddin Owaisi’s MIM led in 17, and the Congress in two.

జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు: పోస్టల్ బ్యాలెట్ లో బీజేపికే మొగ్గు

Posted: 12/04/2020 11:05 AM IST
Ghmc election results bjp leads in 82 wards trs in 31

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో బీజేపి నగరంలోని అత్యధిక డివిజన్లలో తన ఆధిపత్యాన్ని చాటుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు అండగా లేదన్న విషయం స్పష్టంగా వెల్లడైంది. తెలంగాణ సర్కారుపై ఉద్యోగి కన్నెర్ర చేశాడన్న విషయం గత రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలోనూ తేలింది. కాగా, ఈ సారి ఉద్యోగులు రమారమి ఎన్నికలపై నిర్లిప్తత ప్రదర్శించారని కూడా తేలింది. ఈ సారి ఏకంగా 27 వేల మంది ఉద్యోగులు ఎన్నికల విధుల్లో హాజరవుతుండగా, వారిలో కేవలం 2000 లోపు ఉద్యోగులు మాత్రమే పోస్టల్ బ్యాలెట్ హక్కును వినియోగించుకున్నారని సమాచారం. నగర బల్దియా పీఠంపై మళ్లీ టీఆర్ఎస్ జెండా ఎగురుతుందనే భావనతోనే వారు ఈ మేర నిర్లప్తత ప్రదర్శించినట్టు తెలుస్తోంది.

 ఇక రాజధాని నగరంలో పోలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో తమ ఓటు హక్కును వినియోగించుకున్న పలువురు ఉద్యోగులు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఓటు వేసారు. ప్రస్తుతతం అందుబాటులో వున్న సమాచారం మేరకు నగరంలోని మొత్తం  అందుబాటులో ఉన్న ట్రెండ్స్ ప్రకారం, భారతీయ జనతా పార్టీ 82 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, టీఆర్ఎస్ 31 స్థానాల్లో, ఎంఐఎం 16, కాంగ్రెస్ 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఎంఐఎంకు గట్టి పట్టున్న పాతబస్తీలో సైతం పోస్టల్ బ్యాలెట్ లో పలు చోట్ల బీజేపీ ఆధిక్యంలో ఉండటంతో ఫలితాల సరళిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇక ఈ ఫలితాలపై స్పందించిన టీఆర్ఎస్ నాయకులు ఉద్యోగులకు తాము కొంత దూరాన్ని పాటిస్తున్నామన్న విషయాన్ని అంగీకరిస్తూ.. ఇకపై వారిని కూడా కలుపుకుని నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేస్తున్నారు.

కాగా ఈ ఫలితాలపై బీజేపి ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందిస్తూ.. ఇదే ఫలితాలు రాత్రి వరకు కోనసాగుతాయని, బల్దియా పీఠంపై బీజేపి జెండా రెపరెపలాడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ స్పందిస్తూ తెలంగాణ రాష్ట్రంలో మార్పు ప్రారంభమైందని, రానున్న అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికలలో అత్యధిక స్థానాలను కైవసం చేసుకునేందుకు క్షేత్రస్థాయిలో మూలాలను జీహెచ్ఎంసీ ఎన్నికలతో బలపర్చుకున్నామని అన్నారు. ఇకపై జరగనున్న ప్రతీ ఎన్నికలలోనూ విజయాన్ని సాధించి ప్రధాని నరేంద్రమోడీకి కానుకగా అందించేందుకు ప్రతీ బీజేపి కార్యకర్తలో ఉత్సాహాం రెట్టింపు అవుతుందన్నారు. దేశంలోని అనేక రాష్ట్రాలలో ప్రజలతో తెలంగాణ ప్రజలు కూడా మార్పును కోరుకుంటున్నారని, అయితే పూర్తి ఫలితాలు వెలువడిన తరువాత స్పష్టమైన సందేశం వస్తుందని అరవింద్ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles