ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి మరోమారు భయాందోళనకు గురిచేస్తోంది. కరోనావైరస్ సెకెండ్ వేవ్ నేపథ్యంలో ప్రపంచంలోని పలు దేశాలు వణికిపోతున్న తరుణంలో దేశంలోని పరిస్థితులపై వైద్యఆరోగ్య శాఖ అధికారులు, ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలపై దేశ సర్వోన్నత న్యాయస్థానం దృష్టి సారించింది, ఈ నేపథ్యంలో ఇదివరకే దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కరోనా వైరస్ నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలపై అత్యున్నత న్యాయస్థానం స్టేటస్ రిపోర్టును కోరింది. కాగా ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, అసోం రాష్ట్రాలు అందించిన నివేదికలను పరిశీలించిన న్యాయస్థానం.. ఢిల్లీ, గుజరాత్ ప్రభుత్వాలపై అసహనం వ్యక్తం చేసింది.
దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కరోనా కట్టడికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో నివేదిక అందించాలని సుప్రీంకోర్టు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. డిసెంబర్ లో కరోనా మరింత విజృంభించే అవకాశం ఉందని అందోళన వ్యక్తం చేసిన సర్వోన్నత న్యాయస్థానం... పరిస్థితులు మరింత దిగజారక ముందే జాగ్రత్త పడాలని రాష్ట్రాలకు సూచనలు జారీ చేసింది. ఢిల్లీ, గుజారత్, మహారాష్ట్ర, అస్సోం సహా ఇతర రాష్ట్రాలను కూడా ఈ విషయంలో అత్యున్నత న్యాయస్థానం అదేశించింది. కరోనా కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయాన్ని, సహకారాన్ని కోరుకుంటున్నాయో కూడా నివేదికలో పేర్కొనాలని తెలిపింది.
ఈ మేరకు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్ఎస్ రెడ్డిలతో కూడిన సర్వోన్నత న్యాయస్థాన త్రిసభ్య ధర్మాసనం ఆదేశాలను జారీ చేసింది. కరోనాపై పూర్తి స్థాయిలో యుద్ధం చేయకపోతే... డిసెంబర్ లో విపత్కర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని వ్యాఖ్యానించింది. శీతాకాలంలో కరోనా మరింతగా విజృంభించే అవకాశాలు వున్నాయని ఇప్పటికే పలు దేశాల్లో సెకెండ్ వేవ్ తీవ్రత కనబడుతోందని, దీనిని తేలిగ్గా తీసుకోరాదని, న్యాయస్థానం సూచించింది. కాగా, గుజరాత్, ఢిల్లీ, అసోం, మహారాష్ట్ర రాష్ట్రాలలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 44,059 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 91 లక్షలను దాటింది. త్వరలోనే సెకండ్ వేవ్ రాబోతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more