(Image source from: Twitter.com/KTRTRS)
ఈ కామెర్స్ దిగ్గజ సంస్థ అమోజాన్, తన అమెజాన్ వెబ్ సర్వీసెస్ ద్వారా క్లౌడ్ కంప్యూటింగ్ సేవల్లో (ఏడబ్యూఎస్) అగ్రగామిగా కొనసాగుతొంది. ఈ తరుణంలో ఏడబ్యూఎస్ భారత్ లోని తెలంగాణ రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. దాదాపుగా 2.77 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం రూ. 20,761 కోట్లు) పెట్టుబడులతో మల్టిపుల్ డేటా సెంటర్లను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు రాష్ట్ర ఐటీ శఆఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఇంతటి భారీ స్థాయిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేదని అన్నారు,
కాగా, ఈ ఏడాది మొదట్లో అమెజాన్ సంస్థ హైదారబాద్ లో రెండు డేటా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. వాటి కోసం రూ.11630 కోట్ల రూపాయలను పెట్టుబడులుగా పెట్టునున్నారని కూడా వార్తలు వినిపించాయి. కానీ ఇవాళ అధికారికంగా అమెజాన్ సంస్థ ప్రకటన వెలువరించడం బహుళ డేటా కేంద్రాలను ఏర్పాటు చేయడం ఏకంగా అంచనాలకు రెట్టింపు స్థాయిలో పెట్టుబడులు పెట్టుడం రాష్ట్రానికే గర్వకారణం. హైదరాబాద్ లో మూడు అవైలబిలిటీ జోన్లతో (ఎజెడ్) అమెజాన్ వెబ్ సర్వీసెస్ రీజియన్ ను ఏర్పాటు చేయడానికి సంస్థ పెట్టుబడులు పెడుతోందని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.
ఏడబ్యూఎస్ ఆసియా పసిఫిక్ (హైదరాబాద్) రీజియన్ కేంద్రం 2022 మధ్యకాలం నాటికి కార్యకలాపాలను ప్రారంభిస్తుందని అశాభావంతో వున్నాయి సంస్థ వర్గాలు. మల్టిపుల్ డేటా సెంటర్లతో కూడిన అవైలబిలిటీ జోన్లు రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో ఏర్పాటు చేయనున్నారు. అయితే అవన్నీ ఒకే రిజియన్ పరిధిలో ఏర్పాటు చేయనున్నారు, ఈ డేటా సెంటర్లలన్ని వేటికవే స్వతంత్ర వ్యవస్థను కలిగి వుంటాయని తెలిపింది. వీటి శీతలీకరణ, భౌతిక భద్రతతో ఒకదానికొకటి స్వతంత్రంగా పనిచేయడానికి ఇంజనీరింగ్ చేయబడతాయి సంస్థ వర్గాలు తెలిపాయి
తెలంగాణలో భారీ పెట్టుబడులతో భవిష్యత్తులో యువతకు ఉపాధికి బీజం నాటింది అమెజాన్ సంస్థ. 2022 నుంచి తమ డేటా కేంద్రాల నుంచి సర్వీసులను ప్రారంభిస్తామని సంస్థ వర్గాలు తెలిపాయి, “అమెజాన్ వెబ్ సర్వీసెస్ సంస్థ మూడు స్థానాల్లో డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తుందని తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఈ సంస్థ రూ. 20761 కోట్ల భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టడంతో ఇదే మరిన్నీ సంస్థలకు ప్రేరణ కల్పిస్తోందని పేర్కోంది. అంతేకాకుండా భవిష్యత్తులో డేటా సెంటర్లను ఏర్పాటు చేసే ఇతర సంస్థలు తెలంగాణకు ప్రాధాన్యత ఇస్తారని అశాభావం వ్యక్తం చేసింది, అమెజాన్ వెబ్ సర్వీసస్ వంటి డేటా సెంటర్ల స్థాపన తెలంగాణ యొక్క డిజిటల్ ఎకానమీ, ఐటి రంగానికి బహుళ రెట్లు మద్దతు ఇస్తుందని భావిస్తున్నారు. కొత్త ఏడబ్యూఎస్ ఆసియా పసిఫిక్ (హైదరాబాద్) ప్రాంతం మరింత మంది డెవలపర్లు, స్టార్టప్ లతో పాటు కేంద్రంగా మారుతుంది. రీజనల్ సెంటర్లు, డేటా సెంటర్లు స్థాపించడం వల్ల ఇ-కామర్స్, ప్రభుత్వ రంగం, బ్యాంకింగ్, ఆర్థిక సేవలు (బిఎఫ్ఎస్ఐ), ఐటి సహా మరిన్ని రంగాల కార్యకలాపాలు పెరుగుతాయని తెలిపింది.
Happy to announce the largest FDI in the history of Telangana! After a series of meetings, AWS has finalized investment of ₹20,761 Cr ($ 2.77 Bn) to set up multiple data centers in Telangana
— KTR (@KTRTRS) November 6, 2020
The @AWSCloud Hyd Region is expected to be launched by mid 2022#HappeningHyderabad pic.twitter.com/XuGxFfSFsS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more