(Image source from: Timesofindia.indiatimes.com)
కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో మాస్క్ రహిత ప్రయాణాలు చేస్తోన్న వారిని ట్రాఫిక్ పోలీసులు కొరడా జుళిపిస్తున్నారు. మాస్క్ పెట్టుకోకుండా ప్రయాణిస్తున్న వాహనదారుల నుంచి మహమ్మారి ఇతరులకు వ్యాప్తి చెందే ముప్పు పోంచివున్న నేపథ్యంలో వాహనదారులను అపి మరీ మాస్క్ లేని పక్షంలో జరిమానా విధిస్తున్నారు. ఈ విధులను నిర్వహిస్తున్న ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ కు ఓ సిగ్నల్ వద్ద మాస్క్ రహితంగా వెళ్తున్న కారును నిలువరించాడు, దీంతో యజమాని ఆగ్రహంతో ఊగిపోతూ కారును ఆపకుండా ముందుకు తీసుకుపోయాడు. ఆ సమయంలో ఆ కానిస్టేబుల్ కారు ముందే నిలబడి ఉండడంతో కారు బానెట్ పైకి ఎక్కాడు. అయినప్పటికీ, డ్రైవర్ కారును ఆపకుండా ముందుకు తీసుకెళ్లాడు.
అయితే కాసింత ముందుకెళ్లిన తరువాత అపుతాడని భావించిన కానిస్టేబుల్ బ్యాలెన్స్ చేసుకుని అలా ప్రయాణిస్తూనే వున్నాడు. అదే సమయంలో కారు యజమానితో మాట్లాడుతూ.. చాలా తప్పుచేస్తున్నారు.. ఇలా మరింత కఠినమైన శిక్షలకు అస్కారమిస్తున్నారని హితవు పలికాడు. అయినా కారును అపకుండా అలానే పోనిస్తున్నాడు యాజమాని. దీంతో ఈ దృష్యాన్ని చూసిన ఓ ద్విచక్ర వాహనదారుడు ఆ కారును అపేందుకు ప్రయత్నించాడు. కారు ముందు నెమ్మెదిగా వెళ్లబోయాడు. అయినా కారు వేగంలో మార్పు కనిపించకపోవడంతో అతను తన దారిన తాను వెళ్లిపోయాడు. ఈ క్రమంలో మరో ద్విచక్ర వాహనదారుడు రంగంలోకి దిగాడు.
కారును వెంబడిస్తూ.. కారు అద్దంపై కొట్టడంతో పాటు యజమాని చేయిను కూడా పట్టుకునే ప్రయత్నం చేశాడు. స్పీడ్ బ్రేకర్ పై నుంచి కూడా కారు అలానే వెళ్లిన తరువాత అలానే వెంబడిస్తూ మొత్తానికి కారును ఆపగలిగాడు. దీంతో ట్రాఫిక్ కానిస్టేబుల్ కారు బ్యానెట్ పై నుంచి దిగి హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నాడు. ఈ లోపు కారును చుట్టుముట్టిన మిగతా వాహనదారులు కారు యజమానిని పోలీసులకు అప్పగించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను కొందరు స్మార్ట్ఫోన్లలో వీడియో తీశారు. మహారాష్ట్రలోని పూణె, పింప్రి-చిన్చ్వాడ్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కారు నడిపిన వ్యక్తిని అరెస్టు చేసి కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనలో ట్రాఫిక్ కానిస్టేబుల్ అబాసాహెబ్ సావంత్ కాలుకి గాయమైంది.
(Video Source: Hindustan Times)
(And get your daily news straight to your inbox)
Jan 11 | తెలంగాణ సీఎం కేసీఆర్ సమీప బంధువుల కిడ్నాప్ కేసులో అరెస్టయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు సికింద్రాబాద్ కోర్టులో పరాభవం ఎదురైంది. అమె దాఖలు చేసుకున్న బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం... Read more
Jan 11 | భారత్ లో బర్డ్ ఫ్లూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజుకో రాష్ట్రాలకు రాష్ట్రాలను వ్యాపిస్తూ అందోళనకర పరిస్థితులకు దారితీస్తోంది. బర్డ్ ఫ్లూ కేసులు రోజు రోజుకు పెరుగుతూ ఆందోళన కలిగిస్తోంది. మొదట రాజస్థాన్, మధ్యప్రదేశ్లో... Read more
Jan 11 | ఆంధ్రప్రదేశ్ లో వచ్చే నెలలో నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ఎన్నికల కమీషన్ నగరా మ్రోగించిన నేపథ్యంలో దీనిని వ్యతిరేకిస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం.. ఎన్నికలను నిలుపుదల చేయాలని రాష్ట్ర హైకోర్టును... Read more
Jan 11 | వాట్సాప్.. స్మార్ట్ ఫోన్ వున్న పత్రీ ఒక్కరికీ ఇదో అందివచ్చిన అద్భుత సాధనం.. తమ ఫోటోలతో పాటు పలు వీడియోలు, ఇతర సమాచారాన్ని తమ అప్తులు, స్నేహితులు, బంధువులతో పంచుకునేలా దోహదపడుతోంది. అయితే తాజాగా... Read more
Jan 11 | జమ్మూకాశ్మీర్ లో గత ఏడాది జరిగిన ఎన్ కౌంటర్ పథకం ప్రకారం ఆర్మీ అధికారులు చేసిన ఘటనా..? లేక వారు ఉగ్రవాదులా.? అన్న ప్రశ్నలకు ప్రస్తుతం పోలీసుల చార్జీషీటు సంచలనంగా మారింది, జమ్మూకాశ్మీర్ లోని... Read more