(Image source from: Twitter.com/ANI)
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ మహమ్మారి తగ్గుముఖం పడుతున్నా.. యావత్ ప్రపంచవ్యాప్తంగా మాత్రం కరోనా వైరస్ మమమ్మారి రెండో ఉద్దృతిని కొనసాగిస్తోంది. దీంతో మన దేశంలోనూ ఎలాంటి విపత్కర ప్రభావం చూపుతుందా.. అని యావత్ దేశ ప్రజలు అందోళనకు గురువుతున్నారు. ఈ ఏడాది ఆరంభంలో పలు దేశాలు లాక్ అవుట్ ప్రకటించినట్టుగానే ఇక ఇప్పుడు కూడా తాజాగా అవే ఆంక్షల దిశగా కొనసాగుతున్నాయి. అయితే మన దేశంలో మాత్రం ఇంకా అలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాలేదు. దీంతో దేశ ప్రజలు కాసింత ధైర్యంగా వున్నా.. నిగూఢంగా మాత్రం ఏ క్షణంలో ఎలాంటి ఉత్పాతాలు సంభవిస్తాయోనన్న భయం మాత్రం నెలకొనివుంది. అయితే ప్రస్తుతం పరిణామాల నేపథ్యంలో విజృంభన స్తాయి నుంచి తగ్గుముఖం పట్టిన స్థాయి కొనసాగుతోంది.
అయితే నవంబర్ 2వ తేదీ నుంచి రాష్ట్రంలో విద్యాసంస్థలను తెరుస్తున్నామని ముందునుంచీ చెబుతూ వస్తున్న ప్రభుత్వం ఇవాళ్టి నుంచి పాఠశాలలను తెరచి విద్యార్థులకు తరగతులను నిర్వహించింది, దేశవ్యాప్తంగా అన్ లాక్ 5.0 మార్గదర్శకాలు మరో నెల రోజుల పాటు అమల్లో వుంటాయని కేంద్ర హొం మంత్రిత్వ శాఖ ఇటీవలే అదేశాలు జారీ చేసి.. దేశంలోని పాఠశాలలు, విద్యాసంస్థలు, కాలేజీలన్నీ నవంబర్ 30 ఇవే మార్గదర్శకాలు అమలు చేయాలని అదేశాలను వెలువరించినా.. వాటిని తోసిపుచ్చిన ఆంధ్రప్రదేశ్ రాస్ట్ర ప్రభుత్వం మాత్రం నవంబర్ 2 నుంచి పాఠశాలలు, కాలేజీలు, విద్యాసంస్థలను తెరుస్తామని ప్రకటించినట్లుగానే ఇవాళ విద్యాలయాలను తెరచింది.
గత ఏడాది విద్యార్ధులను ఏలాంటి పరీక్షలు లేకుండా పై తరగతులకు ప్రమోట్ చేసిన ప్రభుత్వం.. ఈ విద్యాసంవత్సంలో మాత్రం ఖచ్చితంగా 180 రోజుల పాటు తరగతులను నిర్వహించాలని నిర్ణయించింది. అందుకు పలు మార్గదర్శకాలను కూడా ఇప్పటికే విడుదల చేసింది. ఏప్రిల్ 30 వరకు విద్యార్థులకు తరగతులను నిర్వహించాలని వాటిలో 144 పనిదినాలతో పాటు 36 సెలవు దినాలు కూడా వున్నాయి, సెలవు దినాల్లో ఉపాధ్యాయల పర్యవేక్షణలో ఇళ్ల వద్ద విద్యార్థులు చదవుకునేలా చూడాలని నిర్ణయింది. నవంబర్ నెల రోజులు మాత్రం మద్యాహ్నం వరకు పాఠశాలల్లో తరగతులను నిర్వహించి.. ఆ తరువాత పరిస్థితులను బట్టి స్కూళ్ల సమయాలను పొడిగించే విషయాన్ని పరిశీలించనున్నారు. కాగా తొలి రోజు పాఠశాలలకు మాత్రం కొద్దిపాటి సంఖ్యలోనే విద్యార్థులు హాజరయ్యారని సమాచారం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more