ఆర్జీడి యువనేత తేజస్వీ యాదవ్ తనదైన శైలిలో హేమాహేలీలతో తలపడుతూ తన తండ్రి బాటలో ఎన్నికల రణక్షేత్రంలో దూసుకెళ్తున్నారు. తమతో కలసి గత ఎన్నికలలో మహా కూటమిగా ఏర్పడి అధికారంలోకి వచ్చిన నితీశ్ కుమార్ కూటమి పక్షాలకు వెన్నుపోటు పొడిచిన విధానాన్ని ఇప్పుడు ప్రజలకు వివరిస్తూ ప్రజల్లో మధ్యకు వెళ్తున్నారు. ప్రజలకు నితీశ్ ప్రభుత్వానికి బుద్ది చెప్పాలని అందుకు ఓటుకు ఆయుధంగా మలుచుకోవాలని కోరుతున్నాడు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్రమోడీ.. నితీశ్ కుమార్ పై చేసిన అరోపణల వీడియోలను కూడా అస్త్రాలుగా చేసుకుని ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాడు. ఈ తరుణంలో మూడు విడదల ప్రచారంలో భాగంగా ఇవాళ మరో విడద ప్రచారానికి తెరపడనుండడంతో ఆయన తన తండ్రి రికార్డును కూడా బద్దలుకొడుతున్నాడు.
తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ పేరునున్న అత్యధిక బహిరంగ సభల రికార్డును తాజాగా ఆయన బద్దలు కొట్టారు, ఇవాళ ఒక్కరోజునే ఆయన ఏకంగా 19 సభలు నిర్వహించడం ద్వారా ఆ రికార్డును నెలకొల్పారు, అయితే వీటిలో రెండు రోడ్ షోలు కూడా వుండటం గమనార్హం. ఇక మిగిలిన 17 బహిరంగ సభలు కావడం లో తేజస్వీ యాదవ్ ఈ రికార్డును అందుకున్నారు, ఈ స్థాయిలో బహిరంగ సభలు, రోడ్ షోలలో పాల్గోన్న ఘనత ఎవరికీ లేకపోవడం గమనార్హం. కాగా, తేజస్వీ తండ్రి, ఆర్జేడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మాత్రం గతంలో ఏకంగా 16 బహిరంగసభల్లో పాల్గోన్ని ప్రసంగించడం ద్వారా రికార్డు నెలకొల్పారు.
ఇతక తాజాగా తన తండ్రి పేరున వున్న రికార్డును తేజస్వీ తన సోంతం చేసుకున్నారు. ఇవాళ ఉదయం రెండో విడత ఎన్నికలలో భాగంగా ప్రచారపర్వానికి తెరపడనున్న నేపథ్యంలో ఏకంగా 19 ప్రాంతాల్లో సభల్లో పాల్గోన్ని ఆయన ప్రసంగించి అక్కడి ప్రజలకు తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకు మరీ ముఖ్యంగా యువతకు ఉద్యోగం కల్పిస్తామని హామి ఇస్తున్నారు, తమ పార్టీ అజెండాను ప్రజలు ముందు చెప్పడంతో పాటు నితీశ్ కుమార్ ఏం చేయలేకపోయారు కూడా చెబుతున్నారు, ఉదయం 10.05 గంటలకు సీతామఢిలోని రిగా బ్లాక్ లో మొదటి సభ నిర్వహించిన తేజస్వి సాయంత్రం 4.45 గంటలకు తన చివరి సభను వైశాలి ప్రాంతంలోని బిదుపూర్ బ్లాక్ లో నిర్వహించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more