Tejashwi Yadav breaks Lalu prasad Yadav Record తన తండ్రి పేరునున్న రికార్డును బ్రేక్ చేసిన తేజస్వీ యాదవ్

Bitter elections tejashwi yadav breaks lalu prasad yadav record of highest number of meetings in a day

Tejashwi Yadav, Chief Minister Nitish Kumar, Bihar assembly election 2020,Bihar election news,bihar election 2020 live updates,bihar election news live updates,bihar assembly election live news, election meeting, BJP JDU coalition, Muzaffarpur, Bihar, Politics

RJD leader Tejashwi Yadav's had breaked a record which was in his father Lalu Prasad Yadav's name. Tejashwi had participated the highest number of public rallies in a day and created this record. In the public rallies he promised 10 lakh jobs to the youth. The RJD is trying to attack the Chief Minister and the NDA over comments made in the past when the two were contesting against each other.

తన తండ్రి పేరునున్న రికార్డును బ్రేక్ చేసిన తేజస్వీ యాదవ్

Posted: 11/02/2020 09:35 PM IST
Bitter elections tejashwi yadav breaks lalu prasad yadav record of highest number of meetings in a day

ఆర్జీడి యువనేత తేజస్వీ యాదవ్ తనదైన శైలిలో హేమాహేలీలతో తలపడుతూ తన తండ్రి బాటలో ఎన్నికల రణక్షేత్రంలో దూసుకెళ్తున్నారు. తమతో కలసి గత ఎన్నికలలో మహా కూటమిగా ఏర్పడి అధికారంలోకి వచ్చిన నితీశ్ కుమార్ కూటమి పక్షాలకు వెన్నుపోటు పొడిచిన విధానాన్ని ఇప్పుడు ప్రజలకు వివరిస్తూ ప్రజల్లో మధ్యకు వెళ్తున్నారు. ప్రజలకు నితీశ్ ప్రభుత్వానికి బుద్ది చెప్పాలని అందుకు ఓటుకు ఆయుధంగా మలుచుకోవాలని కోరుతున్నాడు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్రమోడీ.. నితీశ్ కుమార్ పై చేసిన అరోపణల వీడియోలను కూడా అస్త్రాలుగా చేసుకుని ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాడు. ఈ తరుణంలో మూడు విడదల ప్రచారంలో భాగంగా ఇవాళ మరో విడద ప్రచారానికి తెరపడనుండడంతో ఆయన తన తండ్రి రికార్డును కూడా బద్దలుకొడుతున్నాడు.

తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ పేరునున్న అత్యధిక బహిరంగ సభల రికార్డును తాజాగా ఆయన బద్దలు కొట్టారు, ఇవాళ ఒక్కరోజునే ఆయన ఏకంగా 19 సభలు నిర్వహించడం ద్వారా ఆ రికార్డును నెలకొల్పారు, అయితే వీటిలో రెండు రోడ్ షోలు కూడా వుండటం గమనార్హం. ఇక మిగిలిన 17 బహిరంగ సభలు కావడం లో తేజస్వీ యాదవ్ ఈ రికార్డును అందుకున్నారు, ఈ స్థాయిలో బహిరంగ సభలు, రోడ్ షోలలో పాల్గోన్న ఘనత ఎవరికీ లేకపోవడం గమనార్హం. కాగా, తేజస్వీ తండ్రి, ఆర్జేడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మాత్రం గతంలో ఏకంగా 16 బహిరంగసభల్లో పాల్గోన్ని ప్రసంగించడం ద్వారా రికార్డు నెలకొల్పారు.

ఇతక తాజాగా తన తండ్రి పేరున వున్న రికార్డును తేజస్వీ తన సోంతం చేసుకున్నారు. ఇవాళ ఉదయం రెండో విడత ఎన్నికలలో భాగంగా ప్రచారపర్వానికి తెరపడనున్న నేపథ్యంలో ఏకంగా 19 ప్రాంతాల్లో సభల్లో పాల్గోన్ని ఆయన ప్రసంగించి అక్కడి ప్రజలకు తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకు మరీ ముఖ్యంగా యువతకు ఉద్యోగం కల్పిస్తామని హామి ఇస్తున్నారు, తమ పార్టీ అజెండాను ప్రజలు ముందు చెప్పడంతో పాటు నితీశ్ కుమార్ ఏం చేయలేకపోయారు కూడా చెబుతున్నారు, ఉదయం 10.05 గంటలకు సీతామఢిలోని రిగా బ్లాక్ లో మొదటి సభ నిర్వహించిన తేజస్వి సాయంత్రం 4.45 గంటలకు తన చివరి సభను వైశాలి ప్రాంతంలోని బిదుపూర్ బ్లాక్ లో నిర్వహించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles