(Image source from: Hwnews.in)
యావత్ మానవాళిపై ప్రభావం చూపుతున్న కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు భారత్ సహా పలు దేశాలు ఇప్పటికే వాక్సీన్ తయారీలో నిమగ్నమయ్యాయి, ఇప్పటికే పలు దేశాల్లో సెకెండ్ వేవ్ కూడా ఉద్దృతం అవుతుండగా, పది నెలలు కావస్తున్నా ఇంకా కరోనాకు ఇప్పటికే సైడ్ ఎఫెక్ట్స్ లేని వాక్సీన్ అందుబాటులోకి రాకపోవడంతో అందోళన కొనసాగుతూనే వుంది. అయితే కొన్ని వాక్సీన్ లు వచ్చినా వాటి సైడ్ ఎపెక్ట్స్ చాలా వుండగా, పలు వాక్సీన్ మాత్రం కరోనా నియంత్రణను ఎదుర్కోలేక డీలా పడ్డాయి. దీంతో నాణ్యతతో కూడిన వాక్సీన్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఎదురుచూపులు కొనసాగుతూనే వున్నాయి. అయితే భారత్ లో అభివృద్ధి చెందుతున్న భారత్ బయోటెక్ మాత్రం శుభవార్తను తెలిపింది.
వచ్చే ఏడాది రెండో త్రైమాసికం లోపు లేదా జూన్ నెలనాటికి కరోనా మహమ్మారిని ఎదుర్కోందుకు నాణ్యతతో కూడిన టీకాకు తాము ప్రపంచం అందుబాటులోకి తీసుకువస్తామని ప్రకటించింది. ఈ మేరకు సంస్థ అంతర్జాతీయ వ్యవహారాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి ప్రసాద్ కీలక ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో 25 నుంచి 30 కేంద్రాల్లో మూడవ దశ హ్యూమన్ ట్రయల్స్ పరీక్షలను జరిపించనున్నామని తెలిపారు. అయితే ఈ పరీక్షల కోసం ఒక్కో కేంద్రంలో 2 వేల మంది వాలెంటీర్లను నియమించుకున్నామని చెప్పారు. ఈ పరీక్షల నిర్వహణ కోసం మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు.
ఈ దశ ప్రయోగాలు విజయవంతంగా పూర్తి చేసిన తరువాత డ్రగ్ కంట్రోలర్ అధారిటీ అఫ్ ఇండియా నుంచి అనుమితి లభించిన తరువాత 2021 రెండో త్రైమాసికంలో వ్యాక్సిన్ బయటకు వస్తుందని స్పష్టం చేశారు. వ్యాక్సిన్ ను పెద్ద మొత్తంలో సిద్థం చేసేందుకు రూ. 350 కోట్ల నుంచి రూ. 400 కోట్లను పెట్టుబడులుగా పెడుతున్నామని ఆయన స్పష్టం చేశారు, ప్రభుత్వంతో పాటు ప్రైవేటు కంపెనీలకు కూడా టీకాను అందిస్తామని తెలిపారు. టీకా ఎగుమతి విషయంలో పలు దేశాల ఫార్మా కంపెనీలతో ప్రస్తుతం ప్రాథమిక చర్చలు సాగుతున్నాయని తెలిపారు. అయితే, టీకా ఎగుమతి విషయమై ఇప్పటివరకూ ఎటువంటి నిర్ణయాలనూ తమ సంస్థ తీసుకోలేదని సాయి ప్రసాద్ స్పష్టం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more