కరోనా మహమ్మారి బారిన పడిన గానగంధర్వుడు ఎస్పీ బాలు ఆరోగ్యం మెరుగయ్యిందని అయినా ఆయనకు ఎక్మో, వెంటిలేటర్ సాయంతో చికిత్సను అందిస్తూ పూర్తిగా కోలుకునేందుకు చికిత్సను అందిస్తు్నామని ఇటీవల ఆసుపత్రి వర్గాలు విడుదల చేసిన బులెటిన్ లో పేర్కోన్నాయి. ఎస్పీ బాలు కరోనాను జయించారని, ఆయనకు ఇటీవల చేసిన పరీక్షలలో నెగిటివ్ రిపోర్టు వచ్చిన విషయం కూడా అభిమానులకు తెలిసిందే. అయితే మీడియాలో ఆయన అరోగ్యంపై రెండు తప్పుడు కథనాలు రావడంతో ఆయన తనయుడు ఎస్పీ చరణ్ తీవ్రంగా ఖండించారు. తన తండ్రి అరోగ్యం విషయంలో తానే లేదా అసుపత్రి వర్గాలు ఇచ్చే అప్ డేట్స్ ను మాత్రమే విశ్వసించాలని ఆయన ఎస్పీ బాలు అభిమానులను కోరారు. ఈ మేరకు ఆయన ఓ విడుదల సందేశాన్ని విడుదల చేశారు.
‘‘నాన్న నెమ్మదిగా కోలుకుంటున్నారు. అందుకు సమయం పడుతుంది. ఆయన ఆరోగ్యం విషయంలో భారీ మార్పులు ఏవీ లేవు. అందుకే నేనూ రోజూ అప్డేట్ ఇవ్వడం లేదు. ప్రతి రోజూ నాన్నను కలుస్తున్నా. ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉంది. ఇంకా ఎక్మో, వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. అయితే, ఇన్ఫెక్షన్కు సంబంధించి ఎలాంటి సమస్యలు లేవు. మీ ప్రార్థనలు, ప్రేమాభిమానాల వల్ల ఆయన కోలుకుంటున్నారు. ఇక్కడ మీకో విషయం చెప్పాలి. నాన్న ఆరోగ్యానికి సంబంధించి ఒకట్రెండు రోజులకైనా నేను అప్డేట్లు ఇస్తూనే ఉన్నా. అయితే, కొన్ని మీడియా సంస్థలు ప్రచురిస్తున్న వార్తలను అనుసరించవద్దు. వాళ్లు ఎక్కడి నుంచి సమాచారం సేకరిస్తున్నారో తెలియదు. నాన్న ఆరోగ్యానికి సంబంధించి ఏ విషయమైనా నేనే చెబుతాను. లేదా ఆస్పత్రి వర్గాలు అధికారికంగా ప్రకటన విడుదల చేస్తాయని’’ అన్నారు.
‘‘నాన్న ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారని, ఆయన ఊపిరితిత్తుల మార్పిడికి ప్రయత్నిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అది నిజం కాదు. ఒకే రోజు ఇలాంటి రెండు రకాల వార్తలు వచ్చాయి. ఆయన అభిమానుల కోసం ఐసీయూ నుంచి పాట పాడతారన్న వార్తలు కూడా వాస్తవం కాదు. దయచేసి మీడియా సంయమనం పాటించండి. మీరు రాసే వార్తల వల్ల ఉదయం నుంచి అర్ధరాత్రి వరకూ వరుసగా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఒక ఫేక్ న్యూస్ కారణంగా వందల కాల్స్కు సమాధానం ఇవ్వాల్సి వచ్చింది. ఏదైనా విషయాన్ని ధ్రువీకరించుకునేందుకు నాకు గానీ, నా వ్యక్తిగత కార్యదర్శికి గానీ ఫోన్ చేసి మాట్లాడొచ్చు. నాన్న పూర్తి ఆరోగ్యంతో కోలుకుని తిరిగి వస్తారని అందరం ఆశిస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు’’ అని ఎస్పీ చరణ్ పేర్కొన్నారు. ఇటీవల బాలసుబ్రహ్మణ్యానికి కరోనా పరీక్షలు నిర్వహించగా, నెగెటివ్ వచ్చిన సంగతి తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more