కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చే్స్తూ అప్పుడే తొమ్మిది నెలలు గడుస్తున్న తరుణంలో దీనిని నియంత్రించే క్రమంలో తాము వాక్సీన్ రూపోందించామని ప్రకటించిన ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం తమ అస్ట్రాజెనెకా మూడో దశ ప్రయోగాలను తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. బ్రిటన్ లో ఈ టీకా వేయించుకున్న ఓ వాలంటీరుకు అనారోగ్య సమస్యలు తలెత్తిన కారణంగా ఈ మేరకు ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇంగ్లాండ్ లో మాత్రమే ట్రయల్స్ నిలిపివేశారని, కాగా భారత్ లో మాత్రం ట్రయల్స్ యధతధంగా కొనసాగుతాయని ఫూణే కేంద్రంగా హ్యూమన్ ట్రయల్స్ నిర్వహిస్తున్న సెరమ్ ఇండియా ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇలా ప్రకటించిన తరువాత భారత్ ఔషద నియంత్రణ సంస్థ సెరమ్ ఇండియాకు నోటీసులను జారీ చేసింది, దీంతో భారత్ లోనూ మూడవ దశ హ్యూమన్ ట్రయల్స్ నిలిపివేస్తున్నట్లు సెరమ్ ఇండియా ప్రకటించింది. అస్ట్రాజెనికా తమ ప్రయోగాలను యూనైటెడ్ కింగ్ డమ్ లో తమ ప్రయోగాలను తిరిగి ప్రారంభించిన తరువాత మాత్రమే భారత్ లో ఈ ప్రయోగాలు పునఃప్రారంభం అవుతాయని తెలిపింది. అప్పటి వరకు తమ ప్రయోగాలను కూడా తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని సెరమ్ సంస్థ ప్రకటించింది. యూనైటెడ్ కింగ్ డమ్ లో ప్రయోగాలు, వాటి ఫలితాలును పరిశీలిస్తున్నామని.. వాటిన్నింటినీ సమీక్షించిన తరువాత డీజీసీఐ జారీ చేసే సూచనలను అనుసరిస్తున్నామని తెలిపింది.
మూడోదశలో ఉన్న వ్యాక్సిన్ ప్రయోగాల్లో తాజాగా ఒకరిలో ప్రతికూల ప్రభావాలు కనిపించిన నేపథ్యంలో తాత్కాలికంగా వీటిని నిలిపివేస్తున్నట్లు ఇప్పటికే ఆక్స్ఫర్డ్ ప్రకటించింది. అయితే, ఆ వాలంటీర్కు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తాయనే విషయాన్ని మాత్రం ఆస్ట్రాజెనికా వెల్లడించలేదు. క్లినికల్ ట్రయల్స్లో ఇలాంటివి సర్వసాధారణమే అని పేర్కొంది. వ్యాక్సిన్ కు సంబంధించిన దుష్ర్పభావాల సమాచారాన్ని తమకు ఎందుకు తేలియజేయలేదంటూ నోటీసులో ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో డీసీజీఐ ఆదేశాలనుసారం ప్రయోగాలు నిలిపివేస్తున్నట్లు సీరం ఇనిస్టిట్యూట్ ప్రకటించింది. బ్రిటన్, అమెరికా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా దేశాల్లో జరుగుతున్న ప్రయోగాలను కొన్నిరోజులపాటు స్వచ్ఛందంగా ఆపివేస్తున్నట్లు ఆక్స్ఫర్డ్ ఇప్పటికే ప్రకటించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more