మాజీ రాష్ట్రపతి, రాజకీయ కోవిదుడు ప్రణబ్ ముఖర్జీ కన్నుమూశారు. అనారోగ్యంతో గత ఇరవై రోజలుగా ఆయన ఢిల్లీ కంటోన్మెంట్ ఏరియాలోని ఆర్మీ రిసర్చ్ అండ్ రిఫరల్ ఆసుపత్రిలోనే చికిత్స పోందుతు ఇవాళ తుదిశ్వాస విడిచారు, ఆయన తనయుడు అభిజిత్ ముఖర్జీ ఈ విషయాన్ని ధృవీకరిస్తూ తన సామాజిక మాధ్యమం ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇవాళ ఉదయం అర్మీ అసుపత్రి అధికార వర్గాలు వెల్లఢించిన హెల్త్ బులిటెన్ లో ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించిందని.. ఆదివారం రాత్రి నుంచి ఆయన ‘సెప్టిక్ షాక్’ స్థితిలోకి జారుకున్నారని పేర్కోన్నాయి, వెంటిలేటర్ సహాయంతో చికిత్స కొనసాతున్న క్రమంలోనే ఆయన మరణించారు.
ఐదు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ రాజకీయ అనుభవం వున్న రాజకీయ కోవిదుడిగా ప్రణబ్ ముఖర్జీ దేశ ప్రజలకు సుపరిచితుడే. ఇక కాంగ్రెస్ నేతగా ఆ పార్టీలో వివిధ పదవులను అధిరోహించిన ఆయన పార్టీలో ట్రబుల్ షూటర్ గా కూడా పేరోందారు. పార్టీలో ఏక్కడ ఏ సమస్య వచ్చినా ఆయన దానిని చాకచక్యంగా పరిష్కరించేవారు. దీంతో ఆయనకు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రపతిని బరిలో నిలిపి మరీ గెలిపించింది. కాగా, ఎనభై నాలుగేళ్లు ఈ సీనియర్ రాజకీయ వేత్త, ఈ నెల 10వ తేదీని బ్రెయిన్ లో రక్తం గడ్డకట్టడంతో దానికి శస్త్ర చికిత్స చేయించుకునే విషయమై ఆర్మీ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. అయితే సర్జరీ చేసే క్రమంలో ఆయనకు నిర్వహించిన పలు విధాల పరీక్షలలో ఆయనకు కరోనా సోకిందని కూడా నిర్థారణ అయ్యింది.
అయినా వైద్యులు ఆయనకు బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయిన ఆయన భాధను అనుభవిస్తున్న తరుణంలో శస్త్రచికిత్స చేశారు. దీంతో సర్జరీ తరువాత ఆయన ఆరోగ్యం విషమంగా మారిడంతో ఆయన కోమాలోకి జారుకున్నారు. అయితే అప్పటి నుంచి ఆయన పరిస్థితి విషమంగానే ఉంది. సర్జరీ నుంచి వెంటిలేటర్ ను సాయంతోనే ఆయన శ్వాస తీసుకుంటున్నారని అసుపత్రి వర్గాలు తెలిపాయి. కాగా ఆయన ఆసుపత్రిలో చేరిన తరువాత తనకు కరోనా సోకిందని తెలిసి.. గత రెండు వారాలుగా తనను కలసిన వారందరూ తప్పక కరోనా నిర్థారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అదే ఆయన చేసిన ఆఖరు ట్వీట్ గా నిలిచింది. అంపశయ్యపైకి వెళ్తూ కూడా ఆయన తన మూలంగా ఇతరులు బాధపడరాదని పరీక్షలు చేయించుకోమని సూచించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more