(Image source from: Mid-day.com)
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి మళ్లీ విషమించింది, గత పదహారు రోజలుగా ఆయన ఢిల్లీ కంటోన్మెంట్ ఏరియాలోని ఆర్మీ రిసర్చ్ అండ్ రిఫరల్ ఆసుపత్రిలోనే చికిత్స పోందుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించిందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి, గత వారంలో వెంటిలేటర్ పైనే వున్నా.. ఆయన ఆరోగ్యం నిలకడగానే వుండగా, తాజాగా ఆయన ఊపిరి తిత్తులకు కూడా ఇన్ ఫెక్షన్ సోకిందని దీంతో ఆయన అరోగ్యం మరింతగా దిగజారిందని ఆసుపత్రి వర్గాలు తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో పేర్కోన్నాయి,
ప్రణబ్ ముఖర్జీ ఈ నెల 10వ తేదీని బ్రెయిన్ లో రక్తం గడ్డకట్టడంతో దానికి శస్త్ర చికిత్స చేయించుకునే విషయమై ఆర్మీ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. అయితే సర్జరీ చేసే క్రమంలో ఆయనకు నిర్వహించిన పలు విధాల పరీక్షలలో ఆయనకు కరోనా సోకిందని కూడా నిర్థారణ అయ్యింది. అయినా వైద్యులు మాత్రం ఆయన శస్త్రచికిత్స చేశారు. దీంతో సర్జరీ తరువాత ఆయన ఆరోగ్యం విషమంగా మారిడంతో ఆయన కోమాలోకి జారుకున్నారు. అయితే అప్పటి నుంచి ఆయన పరిస్థితి విషమంగానే ఉంది. సర్జరీ నుంచి వెంటిలేటర్ ను సాయంతోనే శ్వాస తీసుకుంటున్నారు.
ఏ క్షణంలో ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని అందోళన చెందిన ఆయన కుటుంబసభ్యులకు ఇవాళ ఆసుపత్రి వర్గాలు మరోమారు ఆయన క్షీణించిందని చెప్పారు. ఊపిరి తిత్తులకు సోకిన ఇన్ ఫెక్షన్ కు చికిత్స అందుతోందని, అయితే నిన్నటి నుంచి, కిడ్నీ సంబంధిత అవయవాల పనితీరు బాగాలేదని తెలిపింది. ప్రస్తుతం ఆయన కోమాలోనే ఉన్నారని, వెంటిలేటర్పై ఉంచే చికిత్స అందిస్తున్నామని పేర్కొంది. తాజా హెల్త్ బులెటిన్ నేపథ్యంలో ప్రణబ్ కుటుంబసభ్యులతో పాటు ఆయన అనూయాయువులు అందోళనకు గురవుతున్నారు. పశ్చిమ బెంగాల్ వాసులు ఆయన ఆరోగ్యంగా తిరిగిరావాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more