రాజధాని విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరోమారు ఎదురుదెబ్బ తగిలింది, ఇన్నాళ్లు రాష్ట్రోన్నత న్యాయస్థానంలో ఎదురుదెబ్బలు తిన్న ప్రభుత్వం ఈసారి ఏకంగా దేశ సర్వోన్నత న్యాయస్థానంలో అదే అనుభవాన్ని అందుకుంది, పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై ఏపీ హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కో ఉత్తర్వులను రద్దు చేయాలని దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ప్రభుత్వానికి అక్కడ ఎదురుదెబ్బ తగిలింది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్పించిన పిటీషన్ ను విచారణను స్వీకరించిన సుప్రీం కోర్టు ధర్మాసనం స్టేటస్ కో ఇవ్వడం కూదరదని ప్రభుత్వ అభ్యర్థనను తోసిపుచ్చింది.
ఈ విషయంలో ఇప్పటికే రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు విచారణ చేస్తున్నందున ఈ దశలో జోక్యం చేసుకోలేమని సుప్రీం ధర్మాసనం తేల్చిచెప్పింది. మూడు రాజధానుల వ్యవహారంపై ఈ నెల 27న (రేపే) హైకోర్టులో విచారణ ఉన్నందున తమ వద్దకు రావడం సరికాదని సర్వోన్నత న్యాయస్థానం ధర్మాసనం అభిప్రాయపడింది. నిర్ణీత గడువులోపు హైకోర్టులో విచారణ ముగించేలా ఆదేశించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా... ఫలాన గడువులోపు విచారణ ముగించాలని తాము ఆదేశించలేమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈకేసును హైకోర్టు త్వరగా పరిష్కరిస్తుందని ఆశిస్తున్నట్టు ధర్మాసనం పేర్కొంది.
రాష్ట్ర ప్రభుత్వం వాదనలపై న్యాయవాది నారీమన్ అభిప్రాయాన్ని ధర్మాసనం ప్రత్యేకంగా తీసుకుంది. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం అమరావతిలో హైకోర్టు ఏర్పడిందని, రాష్ట్రపతి ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని నారీమన్ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. రాష్ట్రపతి ఉత్తర్వులపై అసెంబ్లీలో చట్టం చేయరాదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేశామని ఎలా చెబుతుందని నారీమన్ ప్రశ్నించారు. నారీమన్ అభిప్రాయం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. రాజధాని రైతుల తరఫున సీనియర్ న్యాయవాదులు శ్యాందివాస్, నీరజ్కిషన్పాల్ వాదనలు వినిపించారు.
ఇటీవల ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే ధర్మాసనం ముందుకు ఆ తర్వాత జస్టిస్ ఆర్.ఎఫ్.నారీమన్ ధర్మాసనం ముందుకు మూడు రాజధానుల పిటిషన్ విచారణకు వచ్చినా... సాంకేతిక కారణాలతో మరో ధర్మాసనానికి బదిలీ చేశారు. దీంతో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్ ఇవాళ జస్టిస్ అశోక్భూషణ్ , జస్టిస్ ఆర్.సుభాష్రెడ్డి, జస్టిస్ ఎం.ఆర్.షాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. అయితే సుప్రీం విచారణ నేపథ్యంలో ఆశలు పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి నిరాశే ఎదురైంది, ఇక ఈ కేసుపై రాష్ట్ర హైకోర్టులో రేపు విచారణ జరగనుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more