(Image source from: Forbesindia.com)
ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీతో కలిసి అస్ట్రాజెనికా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ తొలి మానవ ప్రయోగాలు విజయవంతం అయ్యాయని లాన్సెట్ జర్నల్ లో ప్రచురితమైన మరుసటి రోజున, ఇండియాలో ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ తయారీ అనుమతులు పొందిన సీరమ్ ఇనిస్టిట్యూట్ సీఈఓ అదార్ పూనావాలా మీడియాతో మాట్లాడుతూ, ఇక్కడ తయారయ్యే వ్యాక్సిన్ లో 50 శాతం ఇక్కడే వినియోగిస్తామని స్పష్టం చేశారు. ఇండియా నుంచి 60 దేశాలకు వ్యాక్సిన్ ఎగుమతి అవుతుందని, ఇండియాలో ప్రభుత్వమే దీన్ని కొనుగోలు చేసి, ప్రజలకు ఉచితంగా అందిస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న రోగ నిరోధక శక్తిని పెంపొందించే కార్యక్రమాల్లో భాగంగానే ఇది జరుగుతుందని పూనావాలా స్పష్టం చేశారు.
కాగా, ప్రపంచంలోనే అత్యధికంగా వ్యాక్సిన్ లను తయారు చేస్తున్న సంస్థ అయిన సీరమ్ ఇనిస్టిట్యూట్ సీఈఓ, ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ, వ్యాక్సిన్ ట్రయల్స్ ఒక్కో దశా విజయవంతంగా పూర్తవుతూ ఉందని, ఒకసారి నియంత్రణా సంస్థల నుంచి అనుమతులు లభిస్తే, భారీ ఎత్తున తయారీకి తమ సంస్థ సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. "ఇక్కడ తయారయ్యే వ్యాక్సిన్ లో 50 శాతం ఇండియా కోసమే వినియోగిస్తాం. మిగతా 50 శాతం ఎగుమతి చేస్తాం. అది కూడా ప్రతి నెలా తయారయ్యే వ్యాక్సిన్ పరిమాణం ఆధారంగా ఉంటుంది. భారత ప్రభుత్వం మాకెంతో మద్దతుగా నిలుస్తోంది. ఇది ప్రపంచ కష్టమన్న విషయాన్ని మనం గుర్తించాలి. ఈ వ్యాక్సిన్ అవసరం ప్రతి ఒక్కరికీ ఉంది. ప్రపంచం మొత్తానికి మనం రక్షణ కల్పించాలి" అని ఆయన అభిప్రాయపడ్డారు.
అనుకున్న ప్రకారం ట్రయల్స్ పూర్తన తరువాత, అనుకున్నట్లుగా సత్ఫలితాలు వచ్చిన పక్షంలో నవంబర్ లేదా డిసెంబర్ లో కొన్ని లక్షల డోస్ లు సిద్ధమవుతాయని ఆయన అన్నారు, 2021 తొలి త్రైమాసికం నాటికి 30 కోట్ల నుంచి 40 కోట్ల డోస్ లను సిద్ధం చేస్తామని అన్నారు. తొలి దశ వ్యాక్సిన్ ను ఎవరికి ఇవ్వాలన్న విషయంలో మాత్రం కేంద్రానిదే తుది నిర్ణయమని ఆయన అన్నారు. ఆఫ్రికా దేశాల్లో ఈ వ్యాక్సిన్ ను 2 నుంచి 3 డాలర్ల లోపే (సుమారు రూ. 150 నుంచి రూ. 230లోపు) అందించాలన్న నిశ్చయంతో ఉన్నామని తెలిపారు. ఇక ఈ వాక్సీన్ విజయవంతం, కావాలని సైడ్ ఎఫెక్ట్ కూడా ఏమీ లేకుండా సురక్షితం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. దీంతో కరనా మహమ్మారిని దేశం నుంచి తరమివేయవచ్చనని ఆశగా ఎదురుచూస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more