Governer writes letter to CS over Nimmagadda issue నిమ్మగడ్డను ఎన్నికల అధికారిగా నియమించండి: సీ ఎస్ కు గవర్నర్ లేఖ

Ap governer writes letter to chief secretary to appoint nimmagadda ramesh as sec

AP High Court, Nimmagadda Ramesh, state election commissioner, AP Governor, AP SEC, CM YS Jagan, Ashwini Kumar, Advocate General, Nimmagadda Ramesh cases, Andhra Pradesh SEC, Andhra Pradesh news

Andhra Pradesh Governer Bishwabhushan Harichandan writes letter to government Chief Secretary over State Election Commissioner issue as orders to appoint Nimmagadda Ramesh in the said post.

నిమ్మగడ్డను ఎన్నికల అధికారిగా నియమించండి: సీ ఎస్ కు గవర్నర్ లేఖ

Posted: 07/22/2020 12:55 PM IST
Ap governer writes letter to chief secretary to appoint nimmagadda ramesh as sec

(Image source from: Thehindu.com)

రాష్ట్రానికి చెందిన ఎన్నికల కమీషనర్ పదవిలో కొనసాగింపుపై రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు స్పష్టమైన అదేశాలను జారీ చేసినా.. రాష్ట్రప్రభుత్వం పదవీ బాధ్యతలను అప్పగించకుండా అడ్డుకుంటున్న తరుణంలో న్యాయస్థానం అదేశానుసారం ఆయన రాష్ట్ర గవర్నర్ ను కలిసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌.. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను రాష్ట్ర ఎన్నికల అధికారిగా తిరిగి నియమించాలని అదేశాలు జారీ చేశారు. ఈ మేరకు గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ పంపారు.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డను తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోలన్నీ రద్దు చేసిన ఉన్నత న్యాయస్థానం... రమేశ్‌ కుమార్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా తిరిగి నియమించాలని ఆదేశాలు జారీ చేసింది. ఎస్‌ఈసీ విషయంలో నిబంధనలు మారుస్తూ తెచ్చిన ఆర్డినెన్స్‌ను ధర్మాసనం కొట్టివేసింది. ఆర్టికల్‌ 213 ప్రకారం ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్డినెన్స్‌ ఇచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని హైకోర్టు స్పష్టం చేసింది. కాగా న్యాయస్థానం అదేశాలను కూడా అమలుపర్చకుండా తనను పదవీ బాధ్యతలు చేపట్టకుండా అడ్డుకుంటున్న రాష్ట్రప్రభుత్వంపై నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్ ను శుక్రవారం ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై దేశ సర్వోన్నత న్యాయస్తానం సుప్రీంకోర్టులో మూడు సార్లు విచారణ జరిగినా సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదని రమేశ్‌ కుమార్‌ తరఫు న్యాయవాది అశ్వనీకుమార్‌ న్యాయస్థానం దృష్టికి తెచ్చారు.

అయినా.. రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తీర్పును అమలు చేయలేదని వివరించారు. ఇది కోర్టు ధిక్కారం కిందకే వస్తుందని నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తరపు న్యాయవాది అశ్వినీ కుమార్ న్యాయస్థానం దృష్టికి ఆయన తీసుకువచ్చారు. ఎన్నికల కమీషనర్ గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కు బాధ్యతలను ఎందుకని అప్పగించడం లేదని న్యాయస్థానం ప్రభుత్వం తరపు న్యాయవాది అడ్వకేట్ జనరల్ ను ప్రశ్నించింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని రాష్ట్ర గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లాలని తెలిపింది. రాజ్ భవన్ కు చేరుకుని గవర్నర్ ను కలిసి ఆయనకు వినతిపత్రం అందజేయాలని రమేశ్‌కుమార్‌కు సూచించింది.  

దేశ సర్వోన్నత న్యాయస్థాం సుప్రీంకోర్టు స్టే ఇవ్వడానికి మూడు సార్లు నిరాకరించినా రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తీర్పును అమలు చేయకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడుతోందని నిమ్మడ్డ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఉన్నత న్యాయస్థానం.. గవర్నర్‌ను కలిసి హైకోర్టు తీర్పు ప్రకారం తనను ఎస్‌ఈసీగా నియమించాలని కోరాలని సూచించింది. హైకోర్టు ఆదేశాల మేరకు రమేశ్‌ కుమార్‌ సోమవారం గవర్నర్‌ కలిసి వినతిపత్రం అందజేశారు. ఎస్‌ఈసీగా తనను నియమించాలని కోరారు. దీనిపై స్పందించిన గవర్నర్‌ ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles