కరోనా వైరస్ మహమ్మారి దేశంలో వేగంగా విస్తరిస్తున్న క్రమంలో ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లి పరీక్షలు చేయించుకునేందుకు సంశయిస్తున్న ప్రజలకు ప్రైవేటు ల్యాబ్ ల ద్వారా కరోనా పరీక్షలను అందుబాటులోకి తీసుకువచ్చింది కేంద్రం. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ అదేశాల నేపధ్యంలో దేశవ్యాప్తంగా ఐసీఎంఆర్ అనుమతులు పోందిన పలు ప్రైవేటు ల్యాబ్ లకు కరోనా నిర్థారణ పరీక్షలు జరుపుతున్నాయి. అయితే ఈ పరీక్షలకు ఒక్కో రాష్ట్రం ఒక్కో విధంగా ధరలను ప్రకటించింది, కోవిడ్ రోగులు అత్యధికంగా నమోదవుతున్న మహారాష్ట్రంలో ప్రైవేటు ల్యాబ్ లలో కరోనా నిర్థారన పరీక్షలకు రూ.2200 పిక్స్ చేయగా, అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూ. 2900గా నిర్ణయించారు. ఈ మేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ధరలు తెలిసేలా మీడియా ముఖంగా ప్రకటించింది.
కరోనా నిర్ధారణ పరీక్షల కోసం వసూలు చేసే ధరలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా నిర్ణయించడంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు తప్పుబట్టింది. రాష్ట్రల మధ్య కరోనా పరీక్షలకు వత్యాసాలు ఎందుకు వచ్చాయని ప్రశ్నించిన న్యాయస్థానం.. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకొని కచ్చితమైన ధరను నిర్ణయించాలని ఆదేశించింది. కరోనా పరీక్షల ధరలో రాష్ట్రాల మధ్య వ్యత్యాసం లేకుండా, దేశవ్యాప్తంగా ఒకే ధర అమలు చేయాలని జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్.కె. కౌల్, జస్టిస్ ఎమ్ ఆర్ షాలతో కూడిన అత్యున్నత న్యాయస్థానం తిసభ్య ధర్మాసనం అదేశించింది. కరోనా పరీక్షల నిర్వహణకు రాష్ట్రాల మధ్య వున్న వత్యాసాన్ని తొలగించాలని కోరుతూ దాఖలైన పిటీషన్ పై న్యాయస్థానం విచారించింది.
దీంతో పాటు కరోనా రోగులకు చికిత్స చేస్తున్న ఆస్పత్రుల నిర్వహణ, బాధితులకు అందించే సేవలను పర్యవేక్షించేందుకు అన్ని రాష్ట్రాల నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవాలని కూడా సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. ఈ సందర్భంగా కేంద్రం పరిధిలోని అంశంపై తాము జోక్యం చేసుకోలేమని చెప్పిన న్యాయస్థానం.. ఎంత ధరను వసూలు చేయాలనేది కోర్టు నిర్ణయించలేదని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. అలాగే రోగులకు అందించే చికిత్సను పర్యవేక్షించేందుకు ఆస్పత్రుల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు చేయాలని ఆదేశించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. గత నెలలో భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్ఆర్) కరోనా పరీక్షల కిట్ల ధరలు దిగిరావడంతో గతంలో నిర్ణయించిన రూ.4,500 ధరపై పరిమితులను ఎత్తివేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more