కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఆకస్మాత్తుగా విధించిన లాక్ డౌన్ లో తెలంగాణలో పదో తరగతి పరీక్షలు మధ్యలోనే వాయిదా పడ్డాయి. అయితే ఈ పరీక్షలను నిర్వహించేందుకు రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు అనుమతి కోరుతూ ప్రభుత్వం విన్నవించిన నేపథ్యంలో హైకోర్టు అనుమతులు ఇచ్చినా.. ప్రభుత్వం సమర్పించే నివేదిక మేరకు ఈ విషయంలో తుది నిర్ణయాన్ని ఇవాళ ప్రకటిస్తామని చెప్పింది. దీంతో పదో తరగతి పరీక్షల నిర్వహణపై న్యాయస్థానం ఎలాంటి నిర్ణయాన్ని వెలువరిస్తుందని ఇటు విద్యార్థులతో పాటు అటు ప్రభుత్వంలోనూ కొనసాగుతోన్న ఉత్కంఠకు న్యాయస్థానం తెరదించింది. దీంతో గత రెండు రోజులుగా ఈ విషయంలో కోనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది.
అయితే కరోనా వ్యాప్తి వేగంగా విస్తరిస్తున్న గ్రేటర్ హైదరాబాద్ పురపాలక సంఘంలో మాత్రం విద్యార్థులకు పరీక్షల నుంచి మినహాయింపు కల్పించింది. నగరంలో కరోనా శరవేగంగా ప్రబలుతున్న నేపథ్యంలో న్యాయస్థానం ఈ మేరకు నిర్ణయాన్ని తీసుకుంది. జీహెచ్ఎంసీ పరిధిలోని విద్యార్థులను సప్లిమెంటరీ పరీక్షకు అనుమతించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో తప్ప మిగతా పిల్లలందరికీ సోమవారం నుండి పరీక్షలు జరగనున్నాయి. గ్రేటర్ పరిధిలోని విద్యార్థులను సప్లిమెంటరీ పరీక్షకు అనుమతించాలని ఆదేశించింది. సప్లిమెంటరీ ఉత్తీర్ణులను కూడా రెగ్యులర్ గా గుర్తించాలని పేర్కొంది. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల విద్యార్ధులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరీక్షలు నిర్వహించాలని న్యాయస్థానం ప్రభుత్వాన్ని, విద్యాశాఖను అదేశించింది. వీటితో పాటు కొన్ని కీలక నిర్ణయాలు కూడా వెలువరించింది.
అయితే జీహెచ్ ఎంసీ, రంగారెడ్డి జిల్లాల్లో జాగ్రత్తలు తీసుకున్నామని పరీక్షలకు అనుమతివ్వాలని ప్రభుత్వం కోరగా, కరోనాతో ఎవరైనా విద్యార్థి మరణిస్తే ఎవరు బాధ్యత వహిస్తారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థి మరణిస్తే ఆ కుటుంబానికి ఎన్ని కోట్లు ఇస్తారు ? ఆ బాధ్యత ఎవరు తీసుకుంటారు? అని ప్రశ్నించింది హైకోర్టు. పరీక్షల కన్నా విద్యార్థుల జీవితాలే ముఖ్యమన్న హైకోర్టు, పరీక్ష కేంద్రాలు ఉన్న ప్రాంతాలు కంటైన్ మెంట్ గా మారితే ఏంచేస్తారని అడిగితే ప్రభుత్వం సమాధానం చెప్పలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. జీహెహ్ఎంసీ లో పెరుగుతున్న కేసుల దృష్ట్యా లక్షల మంది విద్యార్థులను ప్రమాదంలోకి నెట్టలేమని, రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో కూడా పది రోజులకోసారి పరిస్థితి సమీక్షించాలని హైకోర్టు ఆదేశించింది. పరీక్షలు జరుగుతున్న ప్రాంతాల్లో కరోనా కేసులు పెరిగితే అక్కడ వాయిదా వేసేలా నిర్ణయం తీసుకోవాలని చెబుతూ తదుపరి విచారణ 19 వ తేదీకి వాయిదా వేసింది కోర్టు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more