భారత మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం గురించిన ఓ వార్త అటు సోషల్ మీడియాతో పాటు ఇటు దేశీయ మీడియా సంస్థల్లోనూ హల్ చల్ చేస్తోంది. వెయ్యి గొడ్లను తిన్న రాబంధు చిన్న గాలివానకు చచ్చినట్లు.. అన్న నానుడిలా.. పాకిస్థాన్ టెర్రరిస్టు కార్యాకలాపాలు, ముంభై పేలుళ్లుకు బాధ్యుడైన దావూద్.. ఆ తరువాత దాయాధి దేశానికి వెళ్లి అక్కడే కొన్ని దశాబ్దాలుగా తలదాచుకుంటున్న విషయం తెలిసిందే. ఆ మధ్యే ఆయన వయస్సు మీదపడి తద్వారా వచ్చే రుగ్మతల నేపథ్యంలో మరణించారని వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను పాకిస్తాన్ లోని అతని వర్గాలు తోసిపుచ్చాయి. కాగా ఇప్పుడు తాజాగా మరోమారు ఆలాంటి వార్తలే వినిపిస్తున్నాయి.
కరోన వైరస్ బారినపడి దావూద్ మరణించారనే వార్తలు గుప్పుమన్నాయి.. ప్రపంచంలోని మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులలో ఒకరైన దావూద్ ఇబ్రహీం... కరోనావైరస్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందనే వార్తలు శుక్రవారం సాయంత్రం చక్కర్లు కొట్టాయి... అయితే, అతని సోదరుడు టాప్ డాన్ మరియు అతని భార్య ఇద్దరికీ కరోనావైరస్ లేదని పేర్కొన్నారు. కరోనా పాజిటివ్గా తేలడంతో దావూద్ మరియు అతని భార్యను కరాచీలోని ఆర్మీ ఆసుపత్రిలో చేర్పించినట్లు గతంలో వార్తలు వచ్చాయి.. అయితే, అతని సోదరుడు అనీస్ ఇబ్రహీం మాట్లాడుతూ, దావూద్కు, అతని కుటుంబ సభ్యులకు ఎవ్వరికీ కరోనా పరీక్షలు నిర్వహించలేదని తెలిపారు.. వారందరూ తమ ఇంట్లో ఉన్నారని కూడా చెప్పారు.
మరోవైపు.. దావూద్ సిబ్బందిని కూడా నిర్బంధంలో ఉంచినట్లు ముందే వార్తలు వచ్చాయి... ఇంతలో, ఇవాళ ఉదయం కరోనా వైరస్ తో పాకిస్థాన్ లో దావూద్ మరణించాడని కొన్ని వర్గాలు సోషల్ మీడియాలో ప్రచారానికి తెరలేపాయి. ఇక, ప్రముఖ భారతీయ టీవీ ఛానెల్ న్యూస్ ఎక్స్ కూడా.. దావూద్ ఇబ్రహీం కరోనాతో కరాచీలో మృతిచెందినట్టు ట్వీట్ చేసింది... నిజం ఏంటి? అనేదానిపై క్లారిటీ లేనప్పట్టికీ దావూద్ మృతిచెందారనే వార్త మాత్రం హల్చల్ చేస్తోది... ఇక, భారత్ సహా ఎవ్వరూ చేయలేని పని కరోనా చేసిందనే కామెంట్లు కూడా పెడుతున్నారు. అంతేకాదు రాబంధు గాలివాన అన్నే కామెంట్లు కూడా తెరపైకి వస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more