కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరుడికి భక్తులు సమర్పించిన ఆస్తులను వేలం ద్వారా విక్రయించాలని టీటీడీ కమిటీ నిర్ణయం తీసుకోవడం పెను వివాదంగా మారిన విషయం తెలిసిందే. ఈ విషయమై ఇప్పటికే విపక్షాలు పలు విమర్శలు గుప్పిస్తుండగా, స్వయంగా టీటీడీ బోర్డు సభ్యుడు కూడా అందుకు వ్యతిరేక గళాన్ని వినిపించాడు. దీంతో బెట్టువీడి.. మెట్టుదిగిన టీటీడీ ఆలయ కమిటీ శ్రీవారి ఆస్తులను వేలం వేయాలని ఇంకా నిర్ణయం తీసుకోలేదని కొత్త వాదనను తెరపైకి తీసుకువచ్చాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ నిర్ణయంతో పాటు టీటీడీ నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టును ఆశ్రయించారు.
కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవెంకటేశ్వరుడి ఆస్తులను వేలం వేయకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని బీజేపీ నేత జంగటి అమర్ నాథ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించి ప్రజాప్రయోజన వాజ్యాన్ని వేశారు. దీంతో తిరుమల శ్రీవారి ఆస్తుల వేలం వ్యవహారంపై ఏపీ హైకోర్టుకు చేరింది. అమర్ నాథ్ దాఖలు చేసిన పిటీషన్ లో పలు కీలక అంశాలను న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. 2016లో అప్పటి టీటీడీ బోర్డు తీర్మానించిన 50 ఆస్తులను వేలం వేయకుండా మాత్రమే ఏపీ ప్రభుత్వం ఆపిందని.. ఆ ప్రక్రియను నిలుపుదల చేస్తూ జీవో జారీ చేసిందని పిటిషన్లో పేర్కొన్నారు.
అయితే ప్రస్తుత బోర్డు వేలం వేయాలని గుర్తించిన 23 ఆస్తుల అర్రాసు ప్రక్రియను మాత్రమే ఆపలేదని అమర్ నాథ్ తన పిల్ లో పేర్కోన్నారు. ఆ పక్రియను కూడా నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ విజ్ఞప్తి చేశారు. అంతేకాదు దేవదేవుడికి భక్తులు ఎంతో భక్తిప్రవత్తుతలతో సమర్పించిన ఆస్తులను భవిష్యత్తులోనూ ఎవరూ వేలం వేయకుండా చర్యలు తీసుకోవాలని హైకోర్టును కోరారు. కాగా, ఈ పిల్ పై విచారణ సందర్భంగా ఏపీకి విస్తారమైన సముద్రతీరం వుందని, అయినా ప్రభుత్వం కేవలం దేవుడికి చెందిన ఆస్తులను విక్రయించే పాలన ఖర్చులను ఎందుకు రాబట్టాలని భావిస్తోందని ప్రశ్నించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన బిల్డ్ ఏపీ మిషన్ లో భాగంగా ప్రభుత్వ భూములను విక్రయించాలని పిటిషన్ పై విచారణ జరుపుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ భూములను అమ్మడం ద్వారా నిధులు సంపాదించాలనే ప్రభుత్వ వైఖరితో కోర్టు తప్పుబట్టింది. " వెయి కిలోమీటర్లు సముద్ర తీరం వున్నా ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలు ధనవంతులుగా వుండగా, రాష్ట్రం ప్రభుత్వం మాత్రం ఆర్థికంగా అణగారిపోయిందా.? దానిని సమృద్ది చేయాలంటే దేవుడి మాన్యాలనే విక్రయించాలా.. ఇలాగే రాష్ట్రాన్ని ప్రగతిపథంలోకి తీసుకెళ్తారా.? ప్రభుత్వం దివాళా తీసిందా? ”అని హైకోర్టు ప్రశ్నించింది.
లాక్ డౌన్ సమయంలో ఇలా భగవంతుడి ఆస్తులను వేలం ద్వారా అమ్మడం ఎంతవరకు అర్ధవంతం? ఒక ప్రభుత్వం ఆలయాలకు చెందిన భూములను పరిరక్షించాలి కానీ ఇలా విక్రయించాలని చూడకూడదని న్యాయస్థానం తెలిపింది. ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయవాది ఈ కేసులో ప్రభుత్వ ప్రతిస్పందనను దాఖలు చేయడానికి ఎక్కువ సమయం కోరారు. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 28 వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. ఈ కేసులో కోర్టు ఆదేశాలకు అనుగుణంగా వేలం యొక్క తదుపరి చర్యలు పాటించాలని ప్రభుత్వానికి సూచించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more