ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన పలు తీర్పులను వెలువరించిన నేపథ్యంలో కోర్ఠు ధిక్కారానికి పాల్పడి ఏకంగా రాష్టోన్నత న్యాయస్థానం హైకోర్టుకు, హైకోర్టు న్యాయమూర్తులకు అఫఖ్యాతి చేకూరేలా విమర్శనాత్మక వ్యాఖ్యలు చేయడం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. దీంతో ఈ వ్యవహారాన్ని సుమోటోగా తీసుకున్న న్యాయస్థానం చర్యలకు కూడా ఉపక్రమించింది. ఈ తరహాలో విమర్శలు చేస్తూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన న్యాయస్థానం.. ఈ వ్యవహారంలో ఏకంగా 49 మంది అధికార పార్టీ నేతలకు నోటీసులను జారీ చేసింది.
రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు నుంచి తాఖీదులు అందుకున్న వైసీపీ నేతల జాబితాలో ఛట్టసభలకు ఎంపికైన నేతలు కూడా వున్నారు. పార్లమెంటు సభ్యుడు నందిగం సురేష్, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తో పాటు 49 మందికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. జడ్జిలను కించపరిచారంటూ వీరిపై ఓ న్యాయవాది పిల్ దాఖలు చేశారు. దీంతో దానిని సుమోటోగా తీసుకున్న న్యాయస్థానం ఈ వ్యవహారంలో ప్రమేయమున్న 49మందికి నోటీసులు జారీ చేసింది.
విచారణ సందర్భంగా టీవీ ఛానళ్లు, సోషల్ మీడియాలో కోర్టు తీర్పులపై వారు చేసిన వ్యాఖ్యలను హైకోర్టు పరిశీలించింది. కోర్టు తీర్పులపై విమర్శలు చేయడాన్ని తప్పుపట్టింది. హైకోర్టు జడ్జీలను కించపరిచేలా కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో పాటు పలువురు వైసీపీ నేతలు కోర్టు ఇచ్చిన తీర్పులను తప్పుబట్టే విధంగా మాట్లాడారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఈ అంశంపై సీరియస్గా దృష్టి పెట్టిన ఏపీ హైకోర్టు... 49 మందికి నోటీసులు జారీ చేయడం సంచలనం సృష్టించింది. సోషల్ మీడియాలో పోస్టులపై చర్యలు తీసుకోవాలని హైకోర్టుకు లేఖ రాసిన న్యాయవాది లక్ష్మీ నారాయణ... వైసీపీ ఎంపీ నందిగం సురేశ్పై లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు చేస్తానని ప్రకటించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more