మహ్మదీయుల పవిత్ర పర్వదినాలలో రంజాన్ పండుగ ఒకటి. ఈ పండుగ వచ్చిందంటే చాలు.. మహ్మదీయ సోదరులు ప్రతీ రోజు ఉపవాస దీక్షలు చేస్తూ.. అత్యంత పవిత్రంగా వుంటారు. ప్రతీ రోజు మసీదులకు వెళ్లి ప్రార్థనల్లో పాల్గొంటారు. ఇక ప్రత్యేకంగా చెప్పకోవాల్సిన ప్రాంతం చార్మినార్. దాంతో పాటు పాతబస్తీ.. ఈపండుగ పర్వదినాలలో ఈ రెండు ప్రాంతాలు కొత్తరూపును సంతరించుకుంటాయి. రంజాన్ నెల ప్రారంభమైన నాటి నుంచి మహ్మదీయ సోదరుల ఇళ్లలో కొత్తశోభ సంతరించుకుంటుంది. ఇక సరిగ్గా పండుగకు పక్షం రోజుల ముందు నుంచి చార్మినార్ లోని చుడీ బజార్ సహా అక్కడి ప్రాంతాలన్నీ సరికొత్త సందడితో కళకళలాడుతుంటాయి.
అయితే, ఈ ఏడాది మాత్రం కరోనా దెబ్బకు అంతా బోసిపోతోంది. ముస్లిం సోదరులు మసీదులకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. పండుగ పర్వదినం రోజున తమవారితో సరదగా గడపుకోలేని పరిస్థితి.. ఎంతలా అంటే కనీసం ఈద్ శుభాకాంక్షలు కూడా చెప్పుకోలేనంతగా మారిపోయింది. ఇంట్లోనే ప్రార్థనలు.. కనీసం మసీదులకు వెళ్థామన్నా ధైర్యం సరిపోని పరిస్థితి. ఇంట్లోనే ఉంటూ ప్రార్థనలు చేసుకోవాల్సి వస్తోంది. ఈ తరం వారే కాకుండా కనీసం మూడు తరాల వారు కూడా ఎప్పుడూ చూడని దారుణమైన పరిస్థితుల్లో రంజాన్ పండుగను హైదరాబాదీలు జరుపుకుంటున్నారు. అయితే శతాధిక వృధ్దుల చెప్పడంతోనే లేక చారిత్రక సాక్షలతోనే ఇలాంటి పరిస్థితి గతంలోనూ ఒక పర్యాయం వచ్చిందని తెలుస్తోంది.
దేశ స్వతంత్ర్యానికి పూర్వం.. శతాబ్ద పుష్కర కాలానికి ముందు అంటే సరిగ్గా 112 ఏళ్లకు ముందు అప్పటి రంజాన్ పండగ పర్యదినం కూడా ఎలాంటి ఆడంబరాలు లేకుండా అప్పటి వారు జరుపుకున్నారు. అదేంటి అప్పుడు కూడా కరోనా వచ్చిందా.? అంటే లేదు. కానీ హైదరాబాద్ ప్రాంతంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు, జిల్లాల వాసులకు ప్రాణాధారమైన మూసీ నదికి వరదలు రావడంతో ముస్లింలు ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకున్నారు. ఈద్గాలు, మసీదులు తెరుచుకున్నా హంగూ ఆర్భాటం లేకుండా రంజాన్ ను జరుపుకున్నారు. 1908లో సెప్టెంబరులో మూసీ వరదలు వచ్చాయి. దాదాపు 17 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది. మూసీ వరద తాకిడికి హైదరాబాద్ నగరంలోని అఫ్జల్గంజ్, ముస్సాలం జంగ్, చాదర్ఘాట్ వంతెనలు తెగిపోయాయి.
ఈ వరదల ధాటికి దాదాపు 15 వేలమంది ప్రాణాలు కోల్పోయారు. 20వేల ఇళ్లు నేల మట్టమయ్యాయి. మూసీ వరద బీభత్సానికి అఫ్జల్గంజ్ ప్రభుత్వాస్పత్రి పూర్తిగా కొట్టుకుపోయింది. కనీసం ఎనిమిది వేల కుటుంబాలు ఆశ్రయం కోల్పోయాయి. అదే వరద బీభత్సం సృష్టించిన సమయంలో రంజాన్ పండుగ వచ్చింది. దీంతో వరదలతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రాలేకపోయారు. రంజాన్ నెల ముగిసే నాటికి కూడా ప్రజలు ఇళ్ల నుంచి బయటకి రాలేదు. దాంతో.. పండుగ సంబురాలను పక్కనబెట్టి ఆ డబ్బును వరద బాధితులకు అందజేశారు. అది జరిగి ఇప్పటికి 112 ఏళ్లు అవుతోంది. ఇప్పుడు హైదరాబాద్లో కరోనా దెబ్బకు భయపడి ప్రజలు 2 నెలలుగా గడప దాటి బయటికి రావట్లేదు. ప్రభుత్వ సూచనల మేరకు ఇప్పుడూ ప్రార్థనలు ఇళ్లకే పరిమితమయ్యాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more