యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా లక్షల మందిని పొట్టనబెట్టుకుంది. ఔషదంలేని ఈ వైరస్ మహమ్మారి నుంచి తప్పించుకునేందుకు పలు దేశాలు లాక్ డౌన్ నే ఆశ్రయించడంతో ప్రపంచ దేశాల ఆర్థిక పరిస్థితి కూడా ఆగమ్యగోచరంగా మారింది. ఇలా కరోనా తన ఉధృతిని చాటుకుంటూ వెళ్తుండగా, దాని అంతం చూసే వ్యాక్సిన్ తయారీలో పరిశోధకులు తలమునకలుగా ఉన్నారు. ఇప్పటికే పలు దేశాలు కరోనా వాక్సిన్ తయారీలో నిమగ్నమై వాటిని ఎలుకలు, కొతులపై కూడా పరిశోధనలు జరిపి విజయవంతం అయ్యారు.
అయితే హ్యూమన్ ట్రయల్స్ మాత్రమే మిగిలివున్నాయి. వీటి కోసం కూడా అనుమతులకు పలు సంస్థలు ప్రభుత్వానికి ఆర్జీలు పెట్టుకున్నాయి. ఇక ఈ విషయంలోనూ విజయం సాధించింది అమెరికాకు చెందిన మోడెర్నా సంస్థ. తొలిదశలో విజయం సాధించిన ఇక మలిధశలో కూడా మెడెర్నా సంస్థ వాక్సీన్ ముందంజలో నిలిచింది. ఈ సంస్థ ఆవిష్కరించిన వ్యాక్సిన్ ఆశాజనక ఫలితాలను ఇస్తోంది. వైరస్ కు వ్యతిరేకంగా శరీరంలో వ్యాధి నిరోధక వ్యవస్థను ప్రోత్సహించడంలో ఈ వ్యాక్సిన్ పనితీరు సంతృప్తికరంగా ఉందని పరిశోధకులు అంటున్నారు.
తొలిదశ హ్యూమన్ ట్రయల్స్ ప్రయోగాలు మొదలయ్యాయి. మార్చిలో 8మంది ఆరోగ్యవంతులపై ఒక్కొక్కరికి రెండుడోసుల చొప్పున ఈ వ్యాక్సిన్ ను ప్రయోగించి చూడగా, వారిలో యాంటీబాడీలు ఉత్పన్నమవడాన్ని గుర్తించారు. అంతేకాదు, ఆ యాంటీబాడీలు కరోనా వైరస్ కణాల ప్రత్యుత్పత్తిని కూడా అడ్డుకుంటున్నాయని పరిశోధనలో వెల్లడైందని తెలిపారు. ఓ వ్యాక్సిన్ లో ఇదే కీలక అంశమని, రెండో దశలో 600 మందిపై త్వరలోనే ప్రయోగాలు ఉంటాయని మోడెర్నా సంస్థ పేర్కొంది. జూలైలో నిర్వహించబోయే మూడో దశలో వేలాదిమంది ఆరోగ్యవంతులపై ప్రయోగించి చూస్తామని వెల్లడించింది. అటు, ఎఫ్ డీయే (అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్) కూడా రెండో దశ ప్రయోగాలకు అనుమతి ఇవ్వడంతో మోడెర్నా సంస్థ పరిశోధకుల్లో ఉత్సాహం రెట్టింపయ్యింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more