తనకు ఎవరు ఎదురోచ్చినా.. తాను ఎవరికి ఎదురైనా ప్రత్యర్థులకే రిస్క్ అన్న బాలయ్య డైలాగ్ చెబుతూ.. నడిరోడ్డుపై రెస్ట్ తీసుకుని స్థానికులను హడలెత్తించిన ఓ చిరుత.. ఓ లారీ డ్రైవర్ ను అటాక్ చేయబోయింది. చిరుతను చూసిన శునకాలు వెంటపడటంతో మనిషిని విడిచిపెట్టింది. ఆ తరువాత స్థానికంగా ఓ పంక్షన్ హాల్ లోకి పరుగుపెట్టింది. ఈ సమాచారంతో రంగంలోకి దిగిన అటవీశాఖ సిబ్బందికి దానిని పట్టుకునే ప్రయత్నం చేసినా.. అది చిక్కకుండా పారిపోతోంది. లాక్ డౌన్ తో రోడ్లు ఖాళీగా వుందని ఆదమరచి రోడ్డుపైనే నిద్రించిన చిరుత.. వైలార్ దేవ్ పల్లి నుంచి మాయం కాగా, హిమాయత్ సాగర్ లో నీళ్లు తాగుతూ కనిపించిందని అక్కడి జాలర్లు కొందరు సమాచారం అందించారు.
జాలర్ల సమాచారంతో ఆ ప్రాంతానికి వెళ్లి తీవ్రంగా చిరుత అచూకీ కోసం అన్వేషించిన అటవీ, పోలీసు శాఖ అధికారుల ప్రయత్నాలు విఫలం అయ్యాయి. ఆచూకీ లభించింది ఇక పట్టేస్తామని భావించినా.. మీరు నన్న పట్టుకోలేరు అంటూ సవాల్ విసురుతూ పారిపోతోంది. మైలార్ దేవ్ పల్లిలో పాద ముద్రల ద్వారా చిరుత గోడ దూకి వెళ్లిందని నిర్థారించిన అధికారులు.. దానిని పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. రాజేంద్రనగర్ హిమాయత్ సాగర్ లో నీళ్లు తాగుతుండగా చిరుతను చూసిన జాలర్లు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.
దీంతో రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు.. ఎన్నిరకాలుగా ప్రయత్నిస్తున్నప్పటికీ చిరుత చిక్కకపోవడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. హై సెక్యూరిటీ కెమెరాలు, డ్రోన్లతో గాలించి, జంతువులను ఎరగా వేసినప్పటికీ చిరుత మాత్రం బయటకు రావడం లేదు. చిరుత చిక్కకపోవడంతో హిమాయత్సాగర్ పరిసర గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఒంటరిగా పొలాలకు వెళ్లేందుకు జంకుతున్నారు. మరోవైపు, చిరుత కోసం తీవ్రంగా వెతుకుతున్న అటవీ అధికారులు నిన్న హిమాయత్సాగర్ జలాశయం చుట్టుపక్కల గ్రామాలైన అజీజ్నగర్, కొత్వాలగూడ, కవ్వగూడ, మర్లగూడ పరిసరాల్లో గాలించారు. అయినప్పటికీ దాని జాడ కనిపించలేదు. ఏమైనా, చిరుతను బంధించే వరకు వెతుకుతూనే ఉంటామని అధికారులు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more