దేశంలో కరోనా విజృంభన వేగంగా కోనసాగుతోంది. మూడో విడత లాక్ డౌన్ చివరి రోజున భారత్ లో కరోనా తన వేగాన్ని పెంచింది. ఇదే సమయంలో మరిన్ని సడలింపులతో నాల్గవ విడత లాక్ డౌన్ అమల్లోకి వచ్చిన రోజున గణంకాలను పరిశీలిస్తే.. ఇంతకుమునుపెన్నడూ లేని విధంగా అత్యధికస్థాయిలో కరోనా కేసులు వెలుగు చూశాయ. కరోనా వైరస్ తో కలసి బతకాల్సిందేనని అటు ప్రభుత్వాలు, ఇటు పారిశ్రామిక వేత్తలు చెబతున్న తరుణంలో.. కరోనా వైరస్ దేశ ప్రజల్లో ఠారెతిస్తోంది. మూడో విడత అమల్లోకి వచ్చిన నాటి నుంచి ప్రతీరోజు మూడువేల కేసులు నమోదు కాగా గత వారం రోజుల నుంచి రమారమి నాలుగు వేల కేసులు నమోదయ్యాయి.
ఇక గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా కొత్తగా 5242 పాజిటివ్ కేసులు నిర్థారణ అయ్యాయి, దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 96 వేల మార్కుకు దాటాయి. గడిచిన 24 గంటల్లో ఐదు వేల 242 పాజిటివ్ కేసులతో దేశవ్యాప్తంగా మొత్తం 96 వేల 169 మందిని ఈ మహమ్మరి తన ప్రభావానికి గురిచేసింది. ఇక కరోనా వైరస్ బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది. దేశంలో మొత్తం మరణాల సంఖ్య 3000 మార్కును దాటింది. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో 157 మరణాలు సంభవించాయి.
దీంతో వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య 3029కి చేరింది. కాగా ఇక ఈ మహమ్మారి బారిన పడిన వారిలో ఇప్పటి వరకు 36,824 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక 56,316 మంది మాత్రం వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పోందుతున్నారు. గతకొన్ని రోజులుగా కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరగడం కాస్త ఊరటనిస్తోండగా, రానున్న రోజుల్లో కరోనా తీవ్రత మరింత పెరిగే అవకాశాలు వున్నాయని నిపుణులు అంచనాలు ప్రజలను అందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటి వరకు దాదాపు 34.06 శాతం మంది కోలుకొని ఇళ్లకు చేరుకున్నారు. కాగా, కరోనా ప్రభావం అధికంగా మహారాష్ట్ర, గుజరాత్ ల్లోనే నమోదు కావడం గమనార్హం.
దేశంలో కరోనావైరస్ బారిన పడి మరణించిన వారిలో అత్యదికులు మహారాష్ట్ర వాసులే కావడం గమనార్హం. మహారాష్ట్రలో మరణాల సంఖ్య ఏకంగా రెండు వేలకు చేరింది. నిన్న ఒక్కరోజే 2347 పాజిటివ్ కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 33053 కేసులు నమోదు కాగా, నిన్న ఒక్కరోజునే రాస్ట్రంలో 63 మంది మరణించారు. దీంతో మొత్తంగా 1198 మంది అసువులుబాసారు. మహారాష్టలో నమోదైన కేసుల్లో అత్యధికంగా దేశ అర్థిక రాజధాని ముంబైలోనే నమోదయ్యాయి. గుజరాత్ నుంచి స్వస్థలాలకు వెళ్లున్న కార్మికుల్లో కరోనా బయటపడటంతో అందోళన కలుగిస్తోంది. ఇక గుజరాత్ లోనూ మొత్తం 11379 కేసులు నమోదు కాగా, 659 మంది కరోనాబారిన పడి మరణించారు.
తమిళనాడులోనూ పెద్ద సంఖ్యలోనే కరోనా కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో మొత్తం కేసులు సంఖ్య 11224కు చేరగా, 78 మరణాలు సంభవించాయి. ఆ తరువాత దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. గడిచిన 24 గంటల్లోనే 721 మొత్తం కరోనా కేసులు 10054కు చేరగా, 160 మరణాలు నమోదయ్యాయి, ఆ తరువాత మధ్యప్రదేశ్ లో ఇప్పటి వరకు మొత్తం 4977 కేసులు నమోదు కాగా, 248 మంది మరణించారు, పశ్చమ బెంగాల్ లో 2677 కేసులు నమోదు కాగా, 238 మంది మరణించారు. ఇక రాజస్థాన్ లో 5202 కేసులు నమోదు కాగా మొత్తం 131 మరణాలు సంభవించాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more