India reaches 67152 Covid-19 cases దేశంలో 67 వేలు దాటిన కరోనా కేసులు.. 2206 మరణాలు

Coronavirus update covid 19 cases in india reaches 67 152

coronavirus in india, coronavirus, covid-19, corona spread, Coronavirus, COVID-19, Coronavirus news, section 144 coronavirus, coronavirus news, coronavirus maharashtra, coronavirus updates, coronavirus in maharashtra, coronavirus in india update, total cases of coronavirus in india, coronavirus hyderabad, coronavirus in tamil nadu, pakistan coronavirus, coronavirus cases, coronavirus in chennai, coronavirus in hyderabad, coronavirus live update india, coronavirus tamil nadu, coronavirus in india mumbai, coronavirus in gujarat, coronavirus in india latest news

India witnessed its biggest jump in Coronavirus-linked cases today, with 4200 people testing positive for COVID-19 in the last 24 hours, government data showed. Positive cases tally reaches to 67152 people have tested positive for coronavirus and 2206 have died due to the virus.

దేశవ్యాప్తంగా 67 వేలకు చేరిన కరోనా కేసులు.. 2206 మరణాలు

Posted: 05/11/2020 10:03 AM IST
Coronavirus update covid 19 cases in india reaches 67 152

దేశంలో కరోనా విజృంభన వేగంగా కోనసాగుతోంది. గత కొన్ని రోజులుగా మూడువేల మందికి పైగా ఈ మహమ్మారి బారిన పడుతున్న దేశప్రజలు గడిచిన 24 గంటల వ్యవధిలో ఏకంగా 4వేలకు పైగా ప్రభావానికి గురయ్యారు, ఇది అందోళనకలిగిస్తుండగా, దేశవ్యాప్తంగా ఇంత అత్యధిక సంఖ్యలో బాధితులు నమోదు కావడం ఇదే తొలిసారి. గతంలో 3900 మంది ఒక్కరోజులో కరోనా వైరస్ బారిన పడగా, తొలిసారి ఆసంఖ్యకు మించిన స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం అందోళన రేపుతోంది.

ఎలాంటి సడలింపులు లేకుండా కఠినంగా లాక్ డౌన్ అమలు చేసిన సందర్భంగా రెండో విడత వరకు రోజుకు వెయి మందికి అటుఇటుగా నమోదైన కేసుల సంఖ్య సడలింపులతో కూడా మూడో విడత లాక్ డౌన్ అమల్లోకి రాగానే కేసులు సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 4200 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.  దీంతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 67 వేల మార్కును చేరింది. దేశవ్యాప్తంగా మొత్తం 67 వేల 152 మందిని ఈ మహమ్మరి తన ప్రభావానికి గురిచేసింది. ఇక కరోనా వైరస్ బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది. దేశంలో మొత్తం మరణాల సంఖ్య 2206కు చేరింది.

దీంతో వైరస్‌ బారిన పడిన వారిలో ఇప్పటి వరకు 20,917 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక 44,029 మంది మాత్రం వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పోందుతున్నారు. గతకొన్ని రోజులుగా కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య పెరగడం కాస్త ఊరటనిస్తోండగా, రానున్న రోజుల్లో కరోనా తీవ్రత మరింత పెరిగే అవకాశాలు వున్నాయని నిపుణులు అంచనాలు ప్రజలను అందోళనకు గురిచేస్తున్నాయి. మహారాష్ట్రలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఈ రాష్ట్రంలో కరోనా కేసులు ఏకంగా 22 వేల మార్కును దాటాయి.  ఏకంగా 832 మంది అసువులుబాసారు. మహారాష్టలో నమోదైన కేసుల్లో అత్యధికంగా దేశ అర్థిక రాజధాని ముంబైలోనే నమోదయ్యాయి.

ఇక గుజరాత్ లోనూ ఇప్పటి వరకు మొత్తం 8194 కేసులు నమోదు కాగా, 493 మంది కరోనాబారిన పడి మరణించారు. మధ్యప్రదేశ్ లోనూ కోవిడ్ ప్రభావం అధికంగా కొనసాగుతోంది.  రాష్ట్రం మొత్తం 3614 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకు 215 మంది మరణించారు. దేశ రాజధాని ఢిల్లీలోనూ వైరస్ తన ప్రభావాన్ని చాటుతుంది. ఢిల్లీలోనూ 6923 మంది కరోనా బారిన పడగా, ఏకంగా 73 మంది మరణించారు. ఇటు తమిళనాడులోనూ కరోనా వైరస్ విజృంభన కొనసాగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో ఏకంగా 669  పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు 7వేల మార్కు దాటింది. మొత్తంగా 7204 మందికి కరోనా 47 మంది మరణించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles