ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది, మొదటి నుంచి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు కరోనాకు దూరంగా గ్రీన్ జోన్ లో వుండగా. గత పది రోజుల క్రితం శ్రీకాకుళం జిల్లా కూడా రెడ్ జోన్ లోకి వెళ్లింది. ఒకటి నుంచి ప్రస్తుతం ఐదు కేసులు శ్రీకాకుళంలో యాక్టివ్ గా వున్నాయి. ఇదే సమయంలో అటు విజయనగరం జిల్లాలో ఎలాంటి కేసులు లేవని జిల్లా వైద్యాధికారులు ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో ఆ జిల్లా కూడా క్రమంగా రెడ్ జోన్లోకి వచ్చి చేరింది. ఈ జిల్లాలోనూ తాజాగా మూడు కరోనా కేసులు నమోదు కావడం రాష్ట్ర మొత్తం రెడ్ జోన్ గా మారిపోయింది.
ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. కరోనా వైరస్ మాత్రం వ్యాప్తి చాటుకుంటూనే వుంది. గత కొద్దికాలంగా రాష్ట్రంలో ప్రతీ రోజు 60పైగా పాజిటివ్ కేసులు నమోదవుతూ వచ్చిన కేసులు ఇవాళ రమారమి అదే మార్క్ వద్దకు చేరుకున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా మరో 56 పాజిటివ్ కేసులు నమోదయ్యయి, బుధవారం ఉదయం నుంచి ఇవాళ ఉదయం వరకు రాష్ట్రంలో కొత్తగా 56 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య అరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 18 వేల మార్కు దాటింది. తాజా గణంకాలతో కలిపి రాష్ట్రంలో కొవిడ్ కేసుల సంఖ్య 1833కి చేరింది.
ఇక రాష్ట్రంలో మరణాల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతూ వుండటం ప్రజలను కలవరానికి గురిచేస్తోంది. రాష్ట్రంలో తాజాగా నమోదైన రెండు మరణాలతో కలపి మొత్తం 38కు చేరుకుంది. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసులలో అత్యధికంగా కృష్టా జిల్లాలోనే నమోదయ్యాయి, కృష్ణాలో 16 పాజిటివ్ కేసులు నమోదుకాగా, గుంటూరులో పది, కర్నూలులో ఏడు నమోదైయ్యాయి, ఆ తరువాత కడపలో ఆరు అనంతపురంలో మూడు, నెల్లూరులో నాలుగు, విశాఖపట్నంలో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, ఇప్పటి వరకు కరోనావైరస్ బారిన పడినవారిలో మొత్తంగా 780 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో ప్రస్తుతం 1015 మంది చికిత్స పొందుతున్నారు.
జిల్లాల వారీగా పరిశీలిస్తే అనంతపురంలో 80 కరోనా కేసులు నమోదుకాగా, 4 మరణాలు సంభవించాయి. చిత్తూరులో 82 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, తూర్పు గోదావరిలో 46 కేసులు నమోదయ్యాయి, ఆ తర్వాత గుంటూరు జిల్లాల్లో 378 కేసులు ఎనమిది మరణాలు సంభవించాయి, కడపలో 96 కేసులు నమోదుకాగా, కృష్ణా జిల్లాలో 316 పాజిటివ్ కేసులు, పదకొండు మరణాలు. కర్నూలులో నమోదైన కరోనా కేసులు 540గా వుండగా, 12 మరణాలు సంభవించాయి. నెల్లూరు-96 కేసులు మూడు మరణాలు, ప్రకాశం- 61, శ్రీకాకుళంలో ఐదు కేసులు నమోదయ్యాయి, విశాఖపట్నంలో 46 కరోనా కేసులు, విజయనగరంలో మూడు, పశ్చిమగోదావరి-59 కేసులు నమోదయ్యాయి,
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more