విశాఖ ఆర్.ఆర్.వెంకటాపురంలోని ఎల్జీ పాలీమర్స్ పరిశ్రమ నుంచి రసాయన విషవాయువు లీకైన దుర్ఘటనపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్రమంత్రులు, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజలు గాఢనిద్రలో వున్న సమయంలో గ్యాస్ లీక్ అవ్వడం.. వారు నిద్రలోనే దానిని పీల్చి అస్వస్థతకు గురికావడంపై రాజకీయ ప్రముఖులు తమ అవేదనను వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఘటనపై ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తదితరులు ట్విటర్ ద్వారా స్పందించారు.
* విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. స్థానిక ప్రభుత్వాలు, అధికారులు వేగంగా చర్యలు తీసుకుని పరిస్థితిని త్వరగా అదుపులోకి తీసుకువస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
* విశాఖలో గ్యాస్ లీకేజీ ఘటనకు సంబంధించి ప్రస్తుత పరిస్థితిపై హోం శాఖ, విపత్తు నిర్వహణ విభాగం అధికారులతో మాట్లాడా. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నా. విశాఖలోని ప్రతి ఒక్కరూ క్షేమంగా ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా’ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఈ దుర్ఘటనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అన్నివిధాలా పూర్తి సహాయం అందిస్తామని అన్నారు.
* విశాఖ శివారులోని ఓ ప్రైవేటు పరిశ్రమ నుంచి రసాయన వాయువు లీకైన ఘటనలో జరిగిన ప్రాణనష్టం నన్ను ఎంతగానో కలచివేసింది. ఈ దారుణ ఘటనలో మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఈ వషయంలో సంబంధిత అధికారులతో పాటు పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ సహా ఎన్డీఆర్ఎఫ్ బలగాలతోనూ తాను మాట్లాడానని, వెంటనే చర్యలు చేపట్టామని వారు తనకు తెలిపారని ఆయన అన్నారు. కాగా ఈ ఘటనలో బాధితులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని అయన అన్నారు.
* విశాఖ ఘటన మనసును కలచివేసిందని కేంద్ర హోంమంత్రి అమిత్ సా అన్నారు. విశాఖ ఘటనపై విపత్తు నిర్వహణ విభాగం అధికారులతో నిరంతరం టచ్ లో వున్నామని, అక్కడి పరిస్థితులపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ విషాద వ్యవహారాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నానని అన్నారు. బాధితులంతా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానన్నారు.
* విశాఖ పాలీమర్ పరిశ్రమ దుర్ఘటన బాధాకరమని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కోన్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి సహాక చర్యలు చేపట్టాయని అమె తెలిపారు బాధితులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
* విశాఖలో రసాయన విషవాయులు లీకైన ఘటన హృదయాన్ని ధ్రవింపజేస్తోందిని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఈ విషాద సమయంలో సమీపంలోని కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు బాధితులకు పూర్తి తోడ్పాటును సహకారాన్ని అందించాలని కోరారు. ఈ దుర్ఘటనలో మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన ఆయన మృతులకు తన సంతాపాన్ని తెలియజేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని అకాంక్షిస్తున్నట్లు తెలిపారు
* విశాఖ ఘటనకు సంబంధించిన దృశ్యాలు చూసి తీవ్ర ఆవేదనకు గురయ్యానని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీర్ తన విచారాన్ని వ్యక్తం చేశారు. ఆత్మీయులను కోల్పోయిన వారికి తన సానుభూతిని వ్యక్తం చేశారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది చాలా భయంకరంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
* విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతికి వ్యక్తం చేశారు. ఇది ఒక దురదృష్టకర సంఘటనగా పేర్కోన్న ఆయన ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి’ అని ఆకాంక్షించారు.
* విశాఖ గ్యాస్ లీక్ ఘటన హృదయవిదారకమైనదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. 8 మంది మృతి చెందడం, వందల మంది తీవ్ర అస్వస్థతకు లోనవడం పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో అస్వస్థతకు గురైనవారు త్వరగా కోలుకోవాలని.. బాధితులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని కోరారు. ఇలాంటి ఘటనలు విశాఖలో తరచూ జరుగుతున్నాయని, ఇకపై అవి పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వీటి వల్ల ప్రజలు అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్నారని అధికారులు ఇలాంటి ఘటనలపై బాద్యతగా మెలగాలని పవన్ సూచించారు.
Saddened by the news of gas leak in a plant near Visakhapatnam which has claimed several lives. My condolences to the families of the victims. I pray for the recovery of the injured and the safety of all.
— President of India (@rashtrapatibhvn) May 7, 2020
PM @narendramodi has spoken to Andhra Pradesh CM Shri @ysjagan regarding the situation in Visakhapatnam. He assured all help and support.
— PMO India (@PMOIndia) May 7, 2020
విశాఖపట్టణం శివార్లలోని ఓ ప్రైవేటు కంపెనీ పరిశ్రమ నుంచి రసాయన వాయువు లీకైన దురదృష్టకర ఘటనలో జరిగిన ప్రాణనష్టం నన్నెంతగానో కలిచివేసింది. ఈ దారుణ ఘటనలో మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. బాధితులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
— Vice President of India (@VPSecretariat) May 7, 2020
The incident in Vizag is disturbing.
— Amit Shah (@AmitShah) May 7, 2020
Have spoken to the NDMA officials and concerned authorities. We are continuously and closely monitoring the situation.
I pray for the well-being of the people of Visakhapatnam.
విశాఖ గ్యాస్ లీకేజీ ఘటన పై ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనిని దురదృష్టకర సంఘటనగా పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. అస్వస్థతకు గురైన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
— Telangana CMO (@TelanganaCMO) May 7, 2020
Shocked & deeply anguished by the visuals from #VizagGasLeak
— KTR (@KTRTRS) May 7, 2020
My wholehearted condolences to those who lost their near & dear. Let’s pray for the well-being of the hospitalised
What a horrible year this has been!
విశాఖ దుర్ఘటన హృదయవిదారకం ...
— Pawan Kalyan (@PawanKalyan) May 7, 2020
•కాలుష్య నియంత్రణ మండలి కఠినంగా వ్యవహరించాలి
విశాఖపట్నం పరిధిలోని ఆర్.ఆర్.వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి విష వాయువులు విడుదలై అయిదు కిలోమీటర్ల మేర ప్రజల భయకంపితులు కావడం...
8 మంది మృతి చెందటం... వందల మంది తీవ్ర అస్వస్థతకు లోనవడం హృదయవిదారకం. మృతుల కుటుంబాలకు నా తరఫున, జనసేన తరఫున ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.
— Pawan Kalyan (@PawanKalyan) May 7, 2020
అస్వస్థతకు గురైనవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. వారికి ప్రభుత్వం మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more