AP liquor sales begin with heavy rush మద్యం దుకాణాల ముందు మందుబాబుల బారులు..

Ap commences sales of liquor with hiked prices by 25 percent

Liquor prices in Andhra, Y S Jaganmohan Reddy, liquor shop, wine shops in AP, Liquor sales in Andhra, Andhra Pradesh

Andhra Pradesh government has decided to raise liquor prices by 25 per cent as it prepares to open retail liquor stores run by the government-owned AP Beverages Corporation. The liquor sales resumed in the state, but at higher prices.

మద్యం దుకాణాల ముందు మందుబాబుల బారులు.. దరలకు రెక్కలు

Posted: 05/04/2020 11:53 AM IST
Ap commences sales of liquor with hiked prices by 25 percent

కరోనా వైరస్‌ విజృంభణను కట్టడి చేసే నేపథ్యంలో విధించిన లాక్ డౌన్‌ తో మందుబాబులకు వాసన కూడా దక్కని రోజులు ముగిసాయి. ఇక ఇవాళ్లి నుంచి మూడో విడత లాక్ డౌన్ పలు సడలింపుల నేపథ్యంలో అమల్లోకి రావడంతో రాష్ట్రంలోని మద్యం దుకాణాల తెరుచుకున్నాయి, దీంతో మద్యం ప్రియులు దేనికోమైతే ఇన్నాళ్లు విలవిల్లాడిపోయారో అదే అందుబాటులోకి వచ్చింది. తాజాగా గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో మద్యం అమ్మకాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతివ్వడంతో వచ్చిన ఈ అవకాశాన్ని మందుబాబులు సద్వినియోగం చేసుకుంటున్నారు.

అయితే మద్యం దుకాణాలు తెరచుకోకముందే మద్యం బాబులు దుకాణాల ఎదురుగా క్యూలో నిలబడ్డారంటే ఎంత డిమాండ్ వుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఈ విషయం బాగా అర్థం చేసుకన్న ప్రభుత్వం మాత్రం మందుబాబులకు షాక్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ్టి నుంచి అదనపు రీటైల్ ఎక్సైజ్ టాక్సు పేరుతో మధ్యం ధరలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చసింది.  దీంతో దేశీయంగా తయారైన ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (ఐఎంఎఫ్ఎల్) మద్యం ధరలకు రెక్కలు వచ్చాయి. ఏకంగా 25శాతం మేర ధరలను పెంచడంతో తాజాగా మద్యం ధరలు బాగా పెరిగాయి,

దీంతో రూ. 120 వుండే క్వార్టర్ మద్యం సీసాపై రూ.10 నుంచి 240 వరకు, రూ. 150 వుండే మద్యం సీసాపై రూ.20 నుంచి 480 వరకు.. అంతకన్నా అధికంగా ధర కలిగిన క్వార్టర్ సీసాలపై రూ.30 నుంచి 720 వరకు పెంచుతూ ప్రభుత్వం అదేశఆలను జారీ చేసింది. ఇక 330 ఎంఎల్ వుండే బీరుపై కూడా రూ.20 నుంచి రూ.3000 వరకు ధర పెంచుతూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చసింది. కంటైన్‌మెంట్‌ జోన్లు తప్ప మిగతా ప్రాంతాల్లో మద్యం అమ్మకాలు ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన మద్యం దుకాణాలు రాత్రి 7 గంటల వరకు కొనసాగనున్నాయి.

దీంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి మద్యం ప్రియులు దుకాణాల వద్ద కిలోమీటర్ల మేర బారులు తీరారు. గుంటూరు జిల్లాలోని బెల్లంకొండ ప్రాంతంలో దుకాణాలు తెరవక ముందే మందుబాబులు పడిగాపులు కాస్తున్నారు. అదేవిధంగా నెల్లూరు, విశాఖ, చిత్తూరు, తిరుపతి, అనంతపురం, విజయవాడ తదితర జిల్లాల్లో మద్యం ప్రియులు దుకాణాల వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. పలు చోట్ల భౌతిక దూరం పాటించకుండా గుంపులుగా చేరారు. నెల్లూరు జిల్లా బోగోలు మండలం నాగులవరంలో మద్యం దుకాణాన్ని స్థానిక మహిళలు అడ్డుకున్నారు. కరోనా భయంతో తమ ప్రాంతంలో మద్యం దుకాణాన్ని నిర్వహించొద్దని వారు అధికారులను కోరుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles