కరోనా వైరస్ విజృంభణను కట్టడి చేసే నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ తో మందుబాబులకు వాసన కూడా దక్కని రోజులు ముగిసాయి. ఇక ఇవాళ్లి నుంచి మూడో విడత లాక్ డౌన్ పలు సడలింపుల నేపథ్యంలో అమల్లోకి రావడంతో రాష్ట్రంలోని మద్యం దుకాణాల తెరుచుకున్నాయి, దీంతో మద్యం ప్రియులు దేనికోమైతే ఇన్నాళ్లు విలవిల్లాడిపోయారో అదే అందుబాటులోకి వచ్చింది. తాజాగా గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మద్యం అమ్మకాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతివ్వడంతో వచ్చిన ఈ అవకాశాన్ని మందుబాబులు సద్వినియోగం చేసుకుంటున్నారు.
అయితే మద్యం దుకాణాలు తెరచుకోకముందే మద్యం బాబులు దుకాణాల ఎదురుగా క్యూలో నిలబడ్డారంటే ఎంత డిమాండ్ వుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఈ విషయం బాగా అర్థం చేసుకన్న ప్రభుత్వం మాత్రం మందుబాబులకు షాక్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ్టి నుంచి అదనపు రీటైల్ ఎక్సైజ్ టాక్సు పేరుతో మధ్యం ధరలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చసింది. దీంతో దేశీయంగా తయారైన ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (ఐఎంఎఫ్ఎల్) మద్యం ధరలకు రెక్కలు వచ్చాయి. ఏకంగా 25శాతం మేర ధరలను పెంచడంతో తాజాగా మద్యం ధరలు బాగా పెరిగాయి,
దీంతో రూ. 120 వుండే క్వార్టర్ మద్యం సీసాపై రూ.10 నుంచి 240 వరకు, రూ. 150 వుండే మద్యం సీసాపై రూ.20 నుంచి 480 వరకు.. అంతకన్నా అధికంగా ధర కలిగిన క్వార్టర్ సీసాలపై రూ.30 నుంచి 720 వరకు పెంచుతూ ప్రభుత్వం అదేశఆలను జారీ చేసింది. ఇక 330 ఎంఎల్ వుండే బీరుపై కూడా రూ.20 నుంచి రూ.3000 వరకు ధర పెంచుతూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చసింది. కంటైన్మెంట్ జోన్లు తప్ప మిగతా ప్రాంతాల్లో మద్యం అమ్మకాలు ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన మద్యం దుకాణాలు రాత్రి 7 గంటల వరకు కొనసాగనున్నాయి.
దీంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి మద్యం ప్రియులు దుకాణాల వద్ద కిలోమీటర్ల మేర బారులు తీరారు. గుంటూరు జిల్లాలోని బెల్లంకొండ ప్రాంతంలో దుకాణాలు తెరవక ముందే మందుబాబులు పడిగాపులు కాస్తున్నారు. అదేవిధంగా నెల్లూరు, విశాఖ, చిత్తూరు, తిరుపతి, అనంతపురం, విజయవాడ తదితర జిల్లాల్లో మద్యం ప్రియులు దుకాణాల వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. పలు చోట్ల భౌతిక దూరం పాటించకుండా గుంపులుగా చేరారు. నెల్లూరు జిల్లా బోగోలు మండలం నాగులవరంలో మద్యం దుకాణాన్ని స్థానిక మహిళలు అడ్డుకున్నారు. కరోనా భయంతో తమ ప్రాంతంలో మద్యం దుకాణాన్ని నిర్వహించొద్దని వారు అధికారులను కోరుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more