60 new Covid-19 cases reported in AP ఏపీలో కరోనా విజృంభన.. కర్నూలులో 400 దాటిన కేసులు

Ap records 60 new covid 19 cases in the last 24 hours taking the overall tally to 1 463

covid-19, coronavirus, coronavirus in india, coronavirus in ap, covid-19 in ap, coronavirus updates, coronavirus pandemic, fight against coronavirus, covid-19 outbreak, coronavirus outbreak in andhra pradesh, coronavirus in nellore, coronavirus in Krishna, coronavirus in prakasam, coronavirus in in kadapah, coronavirus in west godavari, coronavirus news, coronavirus latest news, coronavirus latest update, coronavirus andhra pradesh, coronavirus updates

Andhra Pradesh reported 60new Coronavirus positive cases, with this, the number of positive cases as of positive cases as of FrIday morning reaches 1463. In all, 403 persons completed treatment and were discharged from hospitals.

ఆంధ్రప్రదేశ్ కరోనావైరస్ కల్లోలం.. కర్నూలులో 400 దాటిన కేసులు

Posted: 05/01/2020 12:55 PM IST
Ap records 60 new covid 19 cases in the last 24 hours taking the overall tally to 1 463

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది, గత వారం రోజులుగా ఎన్నడూ యాభై కేసులకు తక్కువగా నమోదు కావడం లేదు, ప్రతీ రోజు 60 నుంచి 70 పాజిటివ్ కేసుల వ్యాప్తి తో అందోళన రేకెత్తిస్తోంది, ఆ మధ్యకాలంలో కాసింత తగ్గినట్టు గణంకాలు స్పష్టం చేసినా.. రాష్ట్రంలో మళ్లీ పాజిటివ్ కేసుల విజృంభన కోనసాగుతోంది,  గడిచిన 24 గంటల వ్యవధిలో 7902 మందిని పరీశీలించగా కొత్తగా మరో 60 పాజిటివ్ కేసులు నమోదయ్యయి, గురువారం ఉదయం పదకొండు గంటల నుంచి ఇవాళ ఉదయం పదకొండు గంటల వరకు రాష్ట్రంలో కొత్తగా 60 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య అరోగ్యశాఖ వెల్లడించింది. వీటితో కలిపి రాష్ట్రంలో కొవిడ్‌ కేసుల సంఖ్య 1463కి చేరింది.

ఇక రాష్ట్రంలో మరణాల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతూ వుండటం ప్రజలను కలవరానికి గురిచేస్తోంది. రాష్ట్రంలో తాజాగా మరో రెండు మరణాలు నమోదు అయ్యది దీంతో మొత్తం మరణాల సంఖ్య కూడా 33కు చేరడం కలవరానికి గురిచేస్తోంది. ఇక ఇప్పటి వరకు కరోనావైరస్ బారిన పడినవారిలో మొత్తంగా 403 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్ అయ్యారు. ఇవాళ నమోదైన కేసుల్లో అత్యధికంగా కర్నూలులో 25, గుంటూరులో 19, కడపలో ఆరు, అనంతపురంలో ఆరు, విశాఖపట్నంలో రెండు, పశ్చిమ గోదావరిలో 2 కేసులు నమోదు అయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో ప్రస్తుతం 1027 మంది చికిత్స పొందుతున్నారు.

జిల్లాల వారీగా పరిశీలిస్తే అత్యధికంగా కరోనా కేసులు కర్నూలు జిల్లాలోనే నమోదయ్యాయి. ఇక్కడ తాజా కేసులను కలిపితే ఏకంగా నాలుగు వందల మార్కు దాటింది. కర్నూలు జిల్లాలో 411 కేసులు నమోదు కాగా, 10 మరణాలు సంభవించాయి. ఆ తర్వాత గుంటూరు జిల్లాల్లో 306 కేసులు ఎనమిది మరణాలు నమోదుకాగా, కృష్ణా జిల్లాలో 246 పాజిటివ్ కేసులు, ఎనమిది మరణాలు సంభవించాయి. నెల్లూరు-84 కేసులు మూడు మరణాలు, ప్రకాశం- 60, పశ్చిమగోదావరి-58, చిత్తూరు-80,  విశాఖపట్నం-25, కడప జిల్లాలో 79 కేసులు, అనంతపురం-67 కేసులు నాలుగు మరణాలు సంభవించాయి. తూర్పుగోదావరి జిల్లాలో 42 కేసులు, ఇక తాజాగా శ్రీకాకుళంలో అత్యల్పంగా ఐదు కేసులు నమోదయ్యాయి, ఇక విజయనగరం జిలాలో ఇప్పటికీ ఒక్క కరోనా కేసు నమోదు కాకపోవడంతో జిల్లా అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles