India crosses 35000 Covid-19 cases దేశంలో 35000 వేల మార్కు దాటిన కరోనా కేసులు..

Coronavirus update covid 19 cases in india crosses 35 000

coronavirus in india, coronavirus, covid-19, corona spread, Coronavirus, COVID-19, Coronavirus news, section 144 coronavirus, coronavirus news, coronavirus maharashtra, coronavirus updates, coronavirus in maharashtra, coronavirus in india update, total cases of coronavirus in india, coronavirus hyderabad, coronavirus in tamil nadu, pakistan coronavirus, coronavirus cases, coronavirus in chennai, coronavirus in hyderabad, coronavirus live update india, coronavirus tamil nadu, coronavirus in india mumbai, coronavirus in gujarat, coronavirus in india latest news

India witnessed its biggest jump in Coronavirus-linked cases today, with 1,993 people testing positive for COVID-19 in the last 24 hours, government data showed. At least 35,000 people have tested positive for coronavirus and 1,147 have died due to the virus.

దేశంలో 35000 మార్కు దాటిన కరోనా కేసులు.. 1147 కోవిడ్ మరణాలు

Posted: 05/01/2020 10:16 AM IST
Coronavirus update covid 19 cases in india crosses 35 000

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభన కోనసాగుతోంది. కరోనా వైరస్ ప్రబలుతున్న నాటి నుంచి ఎన్నడూ లేని విధంగా ఒక్కరోజులో అత్యధికంగా 1993 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఓ వైపు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండగా, మరోవైపు కరోనా బారిన పడి అసువులు బాస్తున్నవారి సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతూనే వుంది. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో 73 మరణాలు సంభవించడంతో దేశంలో మొత్తం మరణాల సంఖ్య 1147కు చేరడం కూడా అందోళన కలిగించే అంశం. లాక్ డౌన్ అమల్లో వుండగానే ఇలాంటి పరిణామాలు ఉత్పన్నమవుతుండటం కూడా దిగ్ర్భాంతికి గురిచేస్తోంది.

ఇక దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 1993 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ గణంకాలు వెల్లడిస్తున్నాయి. ఇవాళ్టి ఉదయానికి దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల 35 వేల మార్కు దాటింది. దేశవ్యాప్తంగా మొత్తం 35 వేల 043 మందిని ఈ మహమ్మరి తన ప్రభావానికి గురిచేసింది. ఇక తాజాగా కరోనా మహమ్మారి బారిన పడి అసువులు బాసిన వారి సంఖ్య కూడా పదకొండు వందల మార్కు దాటింది. గడిచిన 24 గంటల వ్యవధిలో ఏకంగా 79 మందిని పోట్టన బెట్టుకుంది. దీంతో మరణాల సంఖ్య కూడా 1147కు చేరింది. వీరిలో అత్యధికంగా మహారాష్ట్రకు చెందిన వారే కావడం గమనార్హం.

ఈ వైరస్‌ బారిన పడిన వారిలో ఇప్పటి వరకు 8889 మంది కోలుకున్నారని చెప్పారు. దేశవ్యాప్తంగా కరోనా బారినపడి చికిత్స పోందుతున్న వారి సంఖ్య 25, 007గా నమోదైంది.  గతకొన్ని రోజులుగా కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య పెరగడం కాస్త ఊరటనిస్తోంది. గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో 31 మంది, గుజరాత్ లో 19 మరణాలు సంభవించాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వశాఖ వెల్లడించింది. ప్రస్తుతం మొత్తం బాధితుల్లో 7696 మంది కోలుకోగా మరో 22,629 మంది చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వైరస్‌ బారినపడి కోలుకుంటున్న వారిశాతం 24.56గా ఉండటం ఊరటకలిగిస్తోంది.

దేశంలో అత్యధికంగా కొవిడ్‌-19 తీవ్రత మహారాష్ట్రలో కొనసాగుతోంది. ఈ ఒక్క రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పదకొండు వేల మార్కు చేరువలో వున్నాయి, ఇప్పటివరకు 10498 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా మరణాల సంఖ్య కూడా 459 మార్కు దాటింది. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో కొత్తగా 27 మరణాలతోపాటు 537 పాజటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య పదకొండు వేల మార్కుకు చేరువలో కొనసాగుతుంది, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కరోనా వైరస్ విజృంభన కొనసాగుతోంది. ముంబై తరువాత ఈ వైరస్‌ పుణె, నాగ్‌పూర్లో కూడా అధిక ప్రభావం చూపుతోంది. ఈ ప్రాంతాల్లో కూడా కరోనా కేసుల సంఖ్య ఎక్కువగా నమోదువుతున్నాయి.

మహారాష్ట్ర తరువాత గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు అధికంగా నమోదువుతున్నాయి. గుజరాత్ లో మొత్తం కేసుల సంఖ్య 4395కి చేరగా, ఇప్పటివరకు ఏకంగా 214 మంది కరోనా యుద్దం చేస్తూ తనువులు చాలించారు. మధ్యప్రదేశ్‌లోనూ కొవిడ్‌ పంజా విసురుతోంది. రాష్ట్రంలో మొత్తం 2660 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా 137మంది మరణించారు. దేశ రాజధాని ఢిలీల్లోనూ కరోనా జడలు విప్పతోంది. దేశరాజధానిలో గడిచిన 24 గంటల వ్యవధిలో 73 కొత్త కేసులు నమోదు కాగా, మూడు మరణాలు సంభవించాయి. దీంతో ఇప్పటివరకు 3515 మందికి కరోనా సోకగా 59మంది మరణించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles