తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లి బుసకొడుతోంది. ప్రభుత్వం, అరోగ్యశాఖ అధికారులు, వైద్యులు, హెల్త్ వర్కర్లు, శానిటేషన్ సిబ్బంది, పోలీసుల సమిష్టి కృషితో తగ్గిన కేసులు మళ్లీ పెరుగుతుండటం అందోళనకరంగా మారుతోంది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని కాసింత ఊరట పోందుతున్న అధికారుల్లో పెరుగుతున్న కేసులు మళ్లీ టెన్షన్ పెంచుతున్నాయి. గురువారం ఒక్కరోజునే ఏకంగా 22 కేసులు నమోదుకావడం.. ఇక నమోదైన కేసులన్నీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఉండటం గమనార్హం. ఇక తాజా కేసుల నమోదుతో మొత్తంగా తెలంగాణలో ఇప్పటి వరకు ఏకంగా 1038 కరోనా కేసులు నమోదయ్యాయి, ఇక తాజాగా నిన్న మూడు మరణాలు కూడా సంభవించాయి, దీంతో మరణాల సంఖ్య కూడా 28కి చేరింది.
తాజాగా నమోదైన కేసులన్నీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే నమోదు కావడం గమనార్హం. ఇప్పటికే తెలంగాణలో నమోదైన మొత్తం కేసులలో రమారమి యాభై శాతం కేసులు గ్రేటర్ హైదరాబాద్ లోనే నమోదైనవే. దీంతో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు, కరోనా బాధితుల నుంచి ఎవరెవరికి వైరస్ సోకిందా అన్న వివరాలను కూడా తెలుసుకుంటున్నారు. అయితే తాజా కేసుల్లో మార్కెట్లో పనిచేస్తున్న వారి ద్వారా పలువురికి కరోనా వైరస్ వ్యాప్తి చెందినట్లుగా అధికారులు గుర్తించారు.
మలక్ పేట గంజ్ లో పనిచేస్తున్న పహాడీషరీఫ్, జల్పల్లికి చెందిన ఇద్దరు వ్యక్తుల ద్వారా మార్కెట్లో మరో మూడు షాపుల యజమానులకు ఈ వైరస్ సోకిందని నిర్థారించుకున్నారు. తద్వారా వారి కుటుంబసభ్యులకూ కొవిడ్ వ్యాప్తి చెందడంతో వారందరినీ ఐసోలేషన్ లో ఉంచారు. మలక్ పే గంజ్, పహాడీషరీఫ్లను కంటెన్మైంట్ జోన్ గా ప్రకటించారు. ఇక మళ్లీ రాష్ట్రంలో అందులోనూ రాజధానిలో కరోనా బుసకొడుతుందని తెలియడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను అప్రమత్తం చేశారు, రాష్ట్ర వైద్య అరోగ్య అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించి కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలని అదేశించారు, ఇక రాష్ట్రంలో తాజాగా నమోదైన మరణాల్లో మృతులందరూ దీర్ఘకాలిక అనార్యోగ సంబంధాలతో బాధపడుతున్నారని, కరోనా సోకడంతో వారు అందోళనకు గురికావడంతో వారి శరీరం చికిత్సకు సహకరించక మరణించారని అధికారులు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more