లాక్ డౌన్ కారణంగా పలు రాష్ట్రాలకు వలసపోయి కూలీ పనులు చేస్తూ అక్కడే చిక్కుకుపోయిన వలస కూలీలు, కార్మికులు, విద్యార్థులు, పర్యాటకులు.. కరోనా వైరస్ లక్షణాలు లేకుంటే తిరిగి తమ సొంత రాష్ట్రాలకు వెళ్లిపోవచ్చని కేంద్రం తెలిపింది. లాక్ డౌన్ విధించిన దాదాపు 5వారాల తర్వాత కాసింత ఊరటనిస్తూ సడలింపులు చేయడంతో వారికి ఊపిరి పోసినట్లు అయ్యింది. అంతరాష్ట్ర ప్రయాణాలకు అనుమతి తెలుపుతూ కేంద్ర హోంశాఖ పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో దాఖలైన పిటీషన్ నేపథ్యంలో ఈ ఉత్తర్వులు వెలువడటం గమనార్హం.
కోవిడ్ 19 లక్షణాలు లేని వలసకార్మికులను ఇంటికి వెళ్ళడానికి అనుమతించాలని కోరుతూ దాఖలైన అనేక పిటిషన్లను విచారిస్తున్న సుప్రీంకోర్టు.. ఈ అంశంపై స్పందించాలని కేంద్రాన్ని కోరిన ఒక రోజు తర్వాత కేంద్రం తాజా మార్గదర్శకత్వాలను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అందరికీ పరీక్షలు నిర్వహించిన తర్వాతే కరోనా లక్షణాలు లేని వ్యక్తుల తరలింపును చేపట్టవచ్చని హోంశాఖ రాష్ట్రాలకు తెలిపింది. తరలింపు ప్రక్రియలో రెండు రాష్ట్రాల అనుమతి తప్పనిసరి అని హోంశాఖ తెలిపింది. ఈ మేరకు అన్ని రాష్ర్టాలు నోడల్ అధికారులను నియమించుకోవాలని సూచించింది.
కాగా, వలసకార్మికులు తరలివెళ్లే సమయంలో భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. బస్సులను సైతం శానిటైజ్ చేసి నిబంధనలు పాటించాలని హోంశాఖ తెలిపింది. దేశవ్యాప్త లాక్డౌన్ మరో నాలుగు రోజుల్లో ముగుస్తుందనగా కేంద్ర హోంశాఖ అంతరాష్ట్ర ప్రయాణాలపై ఈ మార్గదర్శకాలు జారీ చేసింది. హర్యానాలో చిక్కుకుపోయిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వలసకార్మికులను తిరిగి రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు గత వారం ఉత్తరప్రదేశ్కు అనుమతి ఇచ్చిన తరువాత,బీహార్,జార్ఖండ్ వంటి రాష్ట్రాలు దీన్ని తప్పుబట్టాయి. లాక్ డౌన్ నిబంధనల ఉల్లంఘన కిందకే ఇది వస్తుందని అన్న విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more