India records 1,543 new Covid-19 cases, 62 deaths దేశంలో 24 గంటల్లో 62 కరోనా మరణాలు..

Coronavirus india records 1 543 new covid 19 cases 62 deaths in last 24 hours

coronavirus in india, coronavirus, covid-19, corona spread, Coronavirus, COVID-19, Coronavirus news, section 144 coronavirus, coronavirus news, coronavirus maharashtra, coronavirus updates, coronavirus in maharashtra, coronavirus in india update, total cases of coronavirus in india, coronavirus hyderabad, coronavirus in tamil nadu, pakistan coronavirus, coronavirus cases, coronavirus in chennai, coronavirus in hyderabad, coronavirus live update india, coronavirus tamil nadu, coronavirus in india mumbai, coronavirus in gujarat, coronavirus in india latest news

There were 1,543 new cases of the coronavirus disease (Covid-19) and 62 deaths across the country in the last 24 hours, India’s tally of the coronavirus disease stands at 29,435—including 20,835 active cases, 6869 cured, discharged or migrated and 934 deaths, according to the health ministry’s dashboard at 8am.

దేశంలో 934 కరోనా మరణాలు.. 24 గంటల్లో 62 మరణాలు

Posted: 04/28/2020 10:53 AM IST
Coronavirus india records 1 543 new covid 19 cases 62 deaths in last 24 hours

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. ఓ వైపు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండగా, మరోవైపు కరోనా బారిన పడి అసువులు బాస్తున్నవారి సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతూనే వుంది. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో మరణాలు అందోళన కలిగించే స్థాయిలో నమోదవుతున్నాయి. అటు కేంద్రం అరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖతో పాటు ఇటు రాష్ట్రాలు కూడా కోవిడ్ మరణాల నమోదుపై అందోళన చెందుతున్నాయి. దేశంలో ఈ వైరస్ మహమ్మారి వ్యాప్తిన కట్టిడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించినప్పటికీ కరోనా వ్యాప్తి చెందడంతో పాటు మరణాలను కట్టడి కావడం లేదు  తాజాగా గడిచి, 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 62 మరణాలు సంభవించాయి.

ఇక దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా పదిహేను వందల నలబై మూడు కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ఇవాళ ఉదయానికి దేశంలో నమోదైన మొత్తం కరోనా మృతుల సంఖ్య 934కు చేరింది. కరోనా కేసుల సంఖ్య సుమారుగా 29 వేల మార్కును దాటిందని వెల్లడించింది. ఇవాళ్టి ఉదయానికి 29, 435 మంది ఈ మహమ్మారి ప్రభావానికి గురయ్యారు. ఈ వైరస్‌ బారిన పడిన వారిలో ఇప్పటి వరకు 6869 మంది కోలుకున్నారని చెప్పారు. దేశవ్యాప్తంగా కరోనా బారినపడి చికిత్స పోందుతున్న వారి సంఖ్య 21, 632గా నమోదైంది.  గతకొన్ని రోజులుగా కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య పెరగడం కాస్త ఊరటనిస్తోంది.

గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 62మరణాలు సంభవించడంతోపాటు కొత్తగా 1543 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 29,435కు చేరింది. వీరిలో ఇప్పటివరకు 934మంది మృత్యువాతపడ్డారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వశాఖ వెల్లడించింది. ప్రస్తుతం మొత్తం బాధితుల్లో 6869 మంది కోలుకోగా మరో 21,632 మంది చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వైరస్‌ బారినపడి కోలుకుంటున్న వారిశాతం 23.33గా ఉండటం ఊరటకలిగిస్తోంది.

దేశంలో అత్యధికంగా కొవిడ్‌-19 తీవ్రత మహారాష్ట్రలో కొనసాగుతోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 8590 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 369మంది మృత్యువాతపడ్డారు. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో కొత్తగా 522కేసులు నమోదయ్యాయి. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో ఈ వైరస్‌ తీవ్రత ఆందోళనకరంగా ఉంది. పుణె, నాగ్‌పూర్లో కూడా కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. మహారాష్ట్ర అనంతరం అత్యధికంగా కరోనా మరణాలు గుజరాత్‌లో చోటుచేసుకుంటున్నాయి.

రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3548కి చేరింది. వీరిలో ఇప్పటివరకు 162మంది ప్రాణాలు కోల్పోయారు. మధ్యప్రదేశ్‌లోనూ కొవిడ్‌ ఉద్ధృతి కొనసాగుతోంది. రాష్ట్రంలో మొత్తం 2168 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా 110మంది మరణించారు. దేశ రాజధాని ఢిల్లోలోనూ కరోనా విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 3108 మందికి కరోనా సోకగా 54మంది మరణించారు. ఇక దేశంలో ఢిల్లీ తరువాత కోవిడ్ కేసులు వెలుగుచూసిన తెలంగాణలో కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles