ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తూ.. మానవజాతి మనుగడకే సవాల్ విసురుతోంది. కరోనా మహమ్మారి ధాటికి బ్రటిన్ దేశ ప్రధాన మంత్రి బోరిస్ జాన్ సన్ కూడా అసుపత్రి పాలయ్యారు. తాజాగా మన దేశంలోనూ అత్యధిక కేసులు నమోదైన మహరాష్ట్రలో కరోనా శరవేగంగా వ్యాప్తి చెందుతూ.. తన ప్రభావం ధాటికి ఇప్పటికే వందల మందిని బలి తీసుకుంది. ఇక తాజాగా మహారాష్ట్రకు చెందిన అమాత్యులకు కూడా కరోనా వైరస్ సోకిందన్న వార్త సంచలనంగా మారింది. దీంతో మంత్రివర్యులను అసుపత్రికి తరలించిన చికిత్స అందిస్తున్నారు.
మహారాష్ట్రలో వేగంగా విస్తరిస్తున్న కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు తన బాధ్యతగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆయన సంచరించారు. అయితే అనుమానాల నేపథ్యంలో ప్రతి పది, పక్షం రోజుల వ్యవధిలో ఆయన పరీక్షలు నిర్వహించుకుంటూనే వున్నారు. అయితే పది రోజుల క్రితం జరిపిన పరీక్షల్లో నెగిటివ్ రాగా.. ఇప్పుడు పాజిటివ్ వచ్చింది. మహారాష్ట్ర హౌసింగ్ మినిస్టర్ జితేంద్ర అవహద్కు కరోనా సోకినట్లు తేలింది. దీంతో ఆయనను థానేలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. అయితే ఓ పోలీస్ ఆఫీసర్ వలన మంత్రికి కరోనా సోకి ఉంటుందని భావిస్తున్నారు.
ఏప్రిల్ ఆరంభంలో లాక్డౌన్, లా అండ్ ఆర్డర్ గురించి చర్చించడానికి ముంబ్రా పోలీస్ స్టేషన్లో ఓ సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్ను జితేంద్ర కలిశారు. నాసిక్ వెళ్లొచ్చిన ఆ పోలీస్ ఆఫీసర్కు గురువారం కరోనా పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చింది. దీంతో ఆ ఆఫీసర్ కాంటాక్ట్ అయిన మంత్రి సహా 100 మందికి థానే మున్సిపల్ అధికారులు కరోనా పరీక్షలు చేశారు. ఈ క్రమంలో ఏప్రిల్ 13న మంత్రికి నిర్వహించిన పరీక్షల్లో నెగిటివ్ రాగా.. తాజాగా పాజిటివ్ వచ్చింది. కాగా దీనికంటే ముందు తన సెక్యూరిటీ సిబ్బందిలో కొంతమందికి కరోనా సోకడంతో.. జితేంద్రతో పాటు 15 మంది కుటుంబసభ్యులు వారం రోజుల పాటు క్వారంటైన్లో ఉన్న విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more