దేశంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ.. వైరస్ వ్యాప్తికి మాత్రం ఇంకా అడ్డుపడటం లేదు. ఎమర్జెన్సీ పనులపై బయట తిరిగే వారికే కాదు.. ఇంట్లో ఉండే చిన్నారులను కూడా కరోనా మహమ్మారి కాటు వేస్తోంది. తల్లి లేదా తండ్రి సాయంతో మాత్రమే ఇంట్లోంచి బయటకు వెళ్లే 9 నెలల చిన్నారికి కరోనా సోకడం, తల్లి గర్భం నుంచి బయటపడిన రోజుల వ్యవధిలోని బిడ్డలను కూడా ఈ మహమ్మారి టార్గెట్ చేస్తోంది. చిన్నా, పెద్ద తేడా లేకుండా అన్ని వయసుల వారు ఈ మహమ్మారి బారిని పడుతున్నారు.
ఉత్తరాఖండ్లో 9 నెలల వయసున్న ఓ పసికందు కరోనాను జయించి వార్తల్లోని వ్యక్తిగా మారాడు. కరోనాతో ఆ బాబును ఏప్రిల్ 17న ఆసుపత్రిలో చేర్పించగా.. గురువారం డిశ్చార్జ్ చేశారు. ఆరు రోజుల్లోనే ఆ చిన్నారి కోవిడ్ నుంచి బయటపడటం విశేషం. 48 గంటల వ్యవధిలో రెండుసార్లు కరోనా నెగిటివ్ వచ్చింది. అయితే ఆ చిన్నారికి తండ్రి ద్వారా కరోనా సోకి ఉంటుందని భావిస్తున్నారు. శిశువు తండ్రి తబ్లీగా జమాత్కు వెళ్లగా.. కరోనా సోకడంతో ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చిన్నారి గురించి ఆసుపత్రి డాక్టర్ ఎన్ఎస్ ఖాత్రి మాట్లాడుతూ.. నెలల వయసున్న పసికందు కావడంతో ఈ కేసు ఛాలెంజింగ్గా తీసుకున్నామని అన్నారు.
తల్లి సహా ఆ ఇంట్లోని వారందరికీ కరోనా నెగిటివ్ వచ్చిందని. కానీ ఆ చిన్నారి మాత్రమే కరోనా సోకిందని ఆయన తెలిపారు. పాలు తాగే వయసు కావడంతో.. చిన్నారితో పాటు తల్లి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకున్నామని డాక్టర్లు వివరించారు. ఆ చిన్నారిలో కరోనా లక్షణాలు ఏ మాత్రం కనిపించలేదని, నవ్వుతూ ఉన్నాడని చికిత్స అందించిన డాక్టర్ అనురాగ్ అగర్వాల్ తెలిపారు. ఆ పసికందు కోసం మందులను ఎక్కువగా వాడలేదని, కరోనా నుంచి ఆ చిన్నారి కోలుకోవడంతో ఆసుపత్రి సిబ్బంది మొత్తం ఊపిరి పీల్చుకుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more