దేశంలో కరోనావైరస్ మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో దానిని కట్టడి చేయడానికి లాక్ డౌన్ విధించింది కేంద్రం. దీంతో దేశంలో పలు ఉద్దీపన పథకాలు ప్రకటించిన కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రధాని గరభీ హటావ్ పథకాలు కూడా ప్రకటించింది. ఇందులో భాగంగా దేశంలోని కార్మకులకు కేంద్రం కూడా ఉద్దీపన ప్రకటించింది. తిరిగి కట్టాల్సిన అవసరం లేకుండా పీఎఫ్ లో జమ చేసిన మొత్తం నుంచి కొంత మొత్తాన్ని తీసుకునే వెసలుబాటు కల్పిందింది. దీంతో దేశవ్యాప్తంగా అనేక మంది తమ పీఎఫ్ అకౌంట్ల నుంచి విత్ డ్రాలు చేపట్టారు. ఓ వైపు దేశం మొత్తం లాక్ డౌన్ పేరుతో ఇళ్లలో కూర్చుండగా, పీఎఫ్ శాఖ మాత్రం రికార్డు స్థాయిలో తమ పనితీరును కనబర్చింది.
దేశవ్యాప్తంగా లక్షలాది మంది నుంచి వెల్లువెత్తిన అర్జీలను పరిష్కరించే క్రమంలో కేవలం పదిహేను రోజుల్లో 3.31 లక్షల పీఎఫ్ క్లెయిమ్స్ను పరిష్కరించామని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్వో) తెలిపింది. లాక్డౌన్ కారణంగా దరఖాస్తు చేసుకున్న చందాదారులకు రూ.950 కోట్లు విడుదల చేశామని వెల్లడించింది. లాక్డౌన్ వల్ల ఆర్థిక ఇబ్బందులు గురవ్వకుండా ఉండేందుకు పీఎఫ్ నగదును ప్రత్యేకంగా ఉపసంహరించుకొనేందుకు కేంద్రం ప్రభుత్వం 2020, మార్చి 28న నోటిఫికేషన్ జారీ చేసింది.
ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన (పీఎంజీకేవై) పథకంలో భాగంగా సంఘటిత కార్మికులకు కొంత ఉపశమనం కల్పించింది. ఈ కార్యక్రమం ప్రవేశపెట్టిన 15 రోజుల్లోనే 3.31 లక్షల క్లెయిమ్స్ పరిష్కరించామని రూ.946.49 కోట్లు విడుదల చేశామని కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది. మినహాయింపు పొందిన పీఎఫ్ ట్రస్టుల పథకంలో భాగంగా రూ.284 కోట్లు పంపిణీ చేశారని వెల్లడించింది. ఇందులో టీసీఎస్దే సింహభాగమని పేర్కొంది. కరోనా సహాయ నిబంధనల ప్రకారం భవిష్య నిధిలో జమైన 75 శాతం లేదా మూడు నెలల బేసిక్+డీఏ ఏది తక్కువైతే అది వర్తిస్తుందన్న సంగతి తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more