ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకి వేగంగా పెరుగుతున్నాయి. మార్చి నెల 24 వరకు ఒకటి రెండుగా నమోదూన కేసులు ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ మర్కజ్ మసీదులో జరిగిన తబ్లీగి జమాత్ ప్రార్థనలు వెలుగు చేసిన తరువాత ఈ కేసులు ఒక్కసారిగా వందల సంఖ్యలోకి చేరాయి. దీంతో కేసులు ఏకంగా 300కు చేరవకు చేరుకున్నాయి. ప్రతీరోజు పదుల సంఖ్యలో నమోదవుతున్న కేసులలో ఇవాళ గణనీయమైన మార్పులు సంభవించాయి, గడిచిన 24 గంటల వ్యవధిలో ఆంధ్రప్రదేశ్ ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం.
యావత్ దేశంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 463 కేసులు నమోదు కాగా, ఏపీలో మాత్రం ఒక్క కేసు నమోదు కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు, క్రితం రోజు రాత్రి 9గంటల నుంచి ఈరోజు ఉదయం 9గంటల వరకు ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్లో తెలిపింది. పరీక్షల కోసం 217 మంది నమూనాలు పంపగా 217 రిపోర్టులు నెగిటివ్ వచ్చాయని అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 348 పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. కరోనా బారి నుంచి పూర్తిగా కోలుకున్న వారి సంఖ్య 9కి చేరింది. ఆ తొమ్మిది మందిని డిశ్చార్జి చేసినట్లు అధికారులు వెల్లడించారు.
జిల్లాల వారీగా ఇప్పటి వరకు నమోదైన కరోనా వైరస్ పాజిటివ్ కేసుల వివరాలు ఇలా వున్నాయి,. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 75 కేసులు నమోదు కాగా, ఆ తరువాత గుంటూరు-49, నెల్లూరు-48, కృష్ణా-35, కడప-28, ప్రకాశం - 27, పశ్చిమగోదావరి-22, చిత్తూరు-20, విశాఖపట్నం-20, అనంతపురం-13, తూర్పుగోదావరి జిల్లాలో అత్యల్పంగా-11 కేసులు నమోదయ్యాయి, ఇక విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికీ ఒక్క కరోనా కేసు నమోదు కాకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more