దేశంలో అన్నివర్గాల ప్రజలను కరోనా వైరస్ మహమ్మారి భయకంపితుల్ని చేస్తోంది. ఇప్పటికే కరోనా వైరస్ బారిన పడ్డ వేలాదిమంది ప్రజలు పలు అసుపత్రులలో చికిత్స పోంతదుతున్నారు. కాగా లక్షలాది మంది ప్రజలను కూడా అదుపులోకి తీసుకున్న రాష్ట్రప్రభుత్వాలు వారికి పలు ప్రాంతాల్లో క్వారంటైన్ కేంద్రాలకు తరలించాయి. ఈ సమయంలో ప్రజలు ఇళ్లకు మాత్రమే పరిమితం కావాలని కోరుతున్న ప్రభుత్వాలు, పాలకులు.. ప్రజలకు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తెలుపుతూ.. సూచనలు పాటించాలని కోరుతున్నారు.
కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో అల్పాదాయ వర్గాలకు కేంద్రం శుభవార్తను అందించింది. అల్పాదాయ వ్యక్తిగత, వ్యాపార వర్గాలకు ఉపశమనం కల్పించేలా ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పెండింగ్లో ఉన్న రిఫండ్లను తక్షణమే విడుదల చేయాలని నిర్ణయించింది. కొవిడ్-19 పరిస్థితుల దృష్ట్యా పన్ను చెల్లింపుదారులకు ఊరట కల్పించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ శాఖ వెల్లడించింది.
ఐదు లక్షల రూపాయల్లోపు ఉన్న రిఫండ్లను తక్షణం విడుదల చేయనున్నారు. ఐటీ శాఖ తీసుకున్న తాజా నిర్ణయంతో 14 లక్షల మందికి ఉపశమనం లభించనుంది. జీఎస్టీ, కస్టమ్స్ విభాగాలకు చెందిన దాదాపు మరో లక్ష మంది వ్యాపారులకూ లబ్ధి చేకూరనుంది. ఎంఎస్ఎంఈలకూ ఇది వర్తిస్తుంది. రిఫండ్ల చెల్లింపుల కోసం మొత్తం రూ.18 వేల కోట్లు విడుదల చేస్తున్నట్లు ఐటీ శాఖ తెలిపింది.
In context of COVID-19 situation & to grant immediate relief to taxpayers, GOI has decided to issue all pending income-tax refunds upto Rs.5 lakh & GST/Custom refunds with immediate effect.@nsitharaman @nsitharamanoffc @Anurag_Office @FinMinIndia @PIB_India @cbic_india #StaySafe pic.twitter.com/sF0cU8WyA1
— Income Tax India (@IncomeTaxIndia) April 8, 2020
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more