దేశవ్యాప్తంగా కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తోంది. యువత, ముసలి ముతక అన్న తేడా లేకుండా దేశవ్యాప్తంగా అనేక మంది అన్ని వయస్కుల వారు దీని బారిన పడ్డారు. ఇప్పటికే గంట గంటకు తన బారిన పడుతున్న వారి సంఖ్యను పెంచుకుంటోంది. ఫలితంగా బుధవారం మధ్యాహ్నానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 5274కి చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఇక దేశంలో మరణాల సంఖ్య కూడా నూట యాభై మార్కుకు చేరువలో నిలిచింది. కాగా ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 410 మంది కొవిడ్-19 నుంచి కోలుకున్నారని తెలిపింది.
దేశవ్యాప్తంగా గడిచిన 24గంటల్లో 853 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తాజాగా గణంకాలను వెలువరించింది. గత కొన్నిరోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ వారంలో ఈ కేసుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇక వచ్చే వారం కేసుల సంఖ్య గణనీయంగా పెరుతుందని కూడా పేర్కోంది. అయితే దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 64మంది కరోనావైరస్ ప్రభావంతో మరణించారు,
దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1018కి చేరింది. దేశంలో వెయ్యి కేసులు దాటిన తొలి రాష్ట్రం ఇదే కావడం గమనార్హం. మహారాష్ట్ర తర్వాత తమిళనాడులో 690 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత దేశ రాజధాని ఢిల్లీలో 576 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక మరణాల సంభవించన రాష్ట్రాల్లోనూ మహరాష్ట్రదే అగ్రస్థానం, ఆ తరువాత ఢిల్లీలో 9, గుజరాత్ లో 13, తెలంగాణలో 7, మధ్యప్రదేశ్ లో 13, పంజాబ్ లో 7, కర్ణాటకలో 4, పశ్చిమ బెంగాల్ లో 5, జమ్మూకావ్మీర్ లో 2, ఉత్తర్ ప ్రదేశ్ లో 3, కేరళలో 2, ఆంధ్రప్రదేశ్ లో 4, రాజస్థాన్ లో 3, హర్యానా 3, ఆ తరువాత స్థానంలో తమిళనాడు లో 7 మరణాలు నమోదయ్యాయి,
ఆ తరువాత బిహార్, మిజోరం, ఒడిషాలలో ఒక్కక్కరు చొప్పున కరోనా మరణాలు సంభవించాయి, ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా లక్షా 21, 271 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రిసర్చ్ సభ్యుడు ఆర్ గంగాఖేడ్కర్ తెలిపారు. ఇక కరోనా కేసుల నమోదులో మహరాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ తరువాత తెలంగాణ 427, ఉత్తర్ ప్రదేశ్ 343 కేసులతో, కేరళలో 336, రాజస్థాన్ 328 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇక ఈ కేసుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం కూడా పొంచివుందని తెలిపింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more