Coronavirus: India struggles to find emerging hotspots దేశవ్యాప్తంగా 5274 కరోనా కేసులు, 149 మరణాలు

Coronavirus in india covid 19 cases tally reaches 5274 in india 149 deaths

coronavirus in india, coronavirus, covid-19, corona spread, Coronavirus, COVID-19, Coronavirus news, section 144 coronavirus, coronavirus news, coronavirus maharashtra, coronavirus updates, coronavirus in maharashtra, coronavirus in india update, total cases of coronavirus in india, coronavirus hyderabad, coronavirus in tamil nadu, pakistan coronavirus, coronavirus cases, coronavirus in chennai, coronavirus in hyderabad, coronavirus live update india, coronavirus tamil nadu, coronavirus in india mumbai, coronavirus in gujarat, coronavirus in india latest news

The total number of coronavirus cases in India today jumped to 5274 after nearly 853 new infections were reported in past 24 hours, according to the latest data from Health Ministry. The death toll has gone up to 149 while 326 have recovered, showed the latest data.

విజృంభిస్తున్న కరోనా: దేశంలో 5274 చేరిన పాజిటివ్ కేసులు.. 149 మరణాలు

Posted: 04/08/2020 06:55 PM IST
Coronavirus in india covid 19 cases tally reaches 5274 in india 149 deaths

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తోంది. యువత, ముసలి ముతక అన్న తేడా లేకుండా దేశవ్యాప్తంగా అనేక మంది అన్ని వయస్కుల వారు దీని బారిన పడ్డారు. ఇప్పటికే గంట గంటకు తన బారిన పడుతున్న వారి సంఖ్యను పెంచుకుంటోంది. ఫలితంగా బుధవారం మధ్యాహ్నానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 5274కి చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఇక దేశంలో మరణాల సంఖ్య కూడా నూట యాభై మార్కుకు చేరువలో నిలిచింది. కాగా ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 410 మంది కొవిడ్‌-19 నుంచి కోలుకున్నారని తెలిపింది.

దేశవ్యాప్తంగా గడిచిన 24గంటల్లో 853 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తాజాగా గణంకాలను వెలువరించింది. గత కొన్నిరోజులుగా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ వారంలో ఈ కేసుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇక వచ్చే వారం కేసుల సంఖ్య గణనీయంగా పెరుతుందని కూడా పేర్కోంది. అయితే దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 64మంది కరోనావైరస్ ప్రభావంతో మరణించారు,

దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1018కి చేరింది. దేశంలో వెయ్యి కేసులు దాటిన తొలి రాష్ట్రం ఇదే కావడం గమనార్హం. మహారాష్ట్ర తర్వాత తమిళనాడులో 690 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత దేశ రాజధాని ఢిల్లీలో 576 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక మరణాల సంభవించన రాష్ట్రాల్లోనూ మహరాష్ట్రదే అగ్రస్థానం, ఆ తరువాత ఢిల్లీలో 9, గుజరాత్ లో 13, తెలంగాణలో 7, మధ్యప్రదేశ్ లో 13, పంజాబ్ లో 7, కర్ణాటకలో 4, పశ్చిమ బెంగాల్ లో 5, జమ్మూకావ్మీర్ లో 2, ఉత్తర్ ప ్రదేశ్ లో 3, కేరళలో 2, ఆంధ్రప్రదేశ్ లో 4, రాజస్థాన్ లో 3, హర్యానా 3, ఆ తరువాత స్థానంలో తమిళనాడు లో 7 మరణాలు నమోదయ్యాయి,

ఆ తరువాత బిహార్, మిజోరం, ఒడిషాలలో ఒక్కక్కరు చొప్పున కరోనా మరణాలు సంభవించాయి, ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా లక్షా 21, 271 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రిసర్చ్ సభ్యుడు ఆర్ గంగాఖేడ్కర్ తెలిపారు. ఇక కరోనా కేసుల నమోదులో మహరాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ తరువాత తెలంగాణ 427, ఉత్తర్ ప్రదేశ్ 343 కేసులతో, కేరళలో 336, రాజస్థాన్ 328 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇక ఈ కేసుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం కూడా పొంచివుందని తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles