కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు సంఖ్య పెరుగుతున్న క్రమంలో అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు జనతా కర్ప్యూతో పాటు రాష్ట్రం మొత్తం లాక్ డౌన విధించిన విషయం తెలిసిందే. కేసుల సంఖ్య పెరుగుతోంది. అయినా కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో తెలుగు రాష్ట్రాల్లో భయాందోలనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 40కి పెరిగింది. ఈ ఒక్కరోజే 17 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ ఇవాళ తాజా ప్రకటన విడుదల చేసింది. బాధితుల్లో ఢిల్లీలో మతపరమైన ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వాళ్లే ఎక్కువ మంది ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది.
ఈ క్రమంలో ఢిల్లీ నుంచి వచ్చిన వారిని గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు. వీరి నుంచి తాజాగా పదేళ్ల బాలుడికి కరోనా సోకినట్టు తేలడం కలకలం రేపుతోంది. అనంతపురం జిల్లా హిందూపురంకి చెందిన బాలుడి కరోనా పాజిటివ్ వచ్చింది. నిన్నటి వరకు ఏపీలో కరోనా కేసుల సంఖ్య 23. ఆ సంఖ్య కాస్త ఒక్కసారిగా 40కి పెరగడం అందరిని ఆందోళనకు గురి చేస్తోంది. అటు ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. కరోనా కట్టడికి మరిన్ని చర్యలు చేపట్టింది. లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేసే యోచనలో ఉంది. అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 11 కరోనా కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది.
* అనంతపురం జిల్లా లేపాక్షికి చెందిన పదేళ్ల బాలుడికి కరోనా
* మక్కా నుంచి వచ్చిన కర్నాటక వ్యక్తితో సన్నిహితంగా ఉన్న బాలుడు
* అనంతపురం జిల్లా లేపాక్షికి చెందిన 34 ఏళ్ల మహిలకు కరోనా
* మక్కా నుంచి వచ్చిన కర్నాటక వ్యక్తితో సన్నిహితంగా ఉన్న మహిళ
* ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 11 కరోనా కేసులు
* గుంటూరు జిల్లాలో 9కి చేరిన కరోనా కేసులు
* విశాఖ జిల్లాలో 6, కృష్ణా జిల్లాలో 5కి చేరిన కరోనా కేసులు
* తూర్పుగోదావరి జిల్లాలో 4 కేసులు
* చిత్తూరు, కర్నూలు, నెల్లూరులో ఒక్కో కేసు నమోదు
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more