ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నింటినీ పట్టిపీడిస్తున్న కరోనా వైరస్.. అన్ని రంగాలపైనా తన ప్రభావాన్ని చాటుతోంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ హృదయ విదారక ఘటనకు కూడా కారణమయ్యింది. ఈ కరడుగట్టిన వైరస్ చివరాఖరకు మానవ సంబంధాలను సైతం ప్రభావితం చేసింది. కరోనా వైరస్ బారిన పడి అనంతలోకాలకు తరలివెళ్లిన ఓ వృద్దుడు తుది మజిలీకి చేరుకునే నేపథ్యంలో తమ తాహత్తు మేరకు అంతిమ యాత్ర, శాస్తోక్తంగా దహనసంస్కారాలు చేయాల్సి వున్నా.. ఎవరూ రాకపోవడంతో ఓ అనాథ శవంలాగా అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయి.
ఆయన మరణం ఆయన బంధుజనంతో పాటుగా.. రాష్ట్ ప్రజలందరికీ తెలిసిందీ. ఆయన తుది యాత్రకు, చివరి చూపుకు కూడా నోచుకోకుండా అయినవారు రాలేక, బంధుజనాన్ని రవాణా స్థంభనతో రాలేక.. హెల్త్ వర్కర్లే ఆయనకు అన్ని తామై దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ హృదయవిదారక ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా వున్నాయి.. తెలంగాణలో కరోనా వైరస్ ప్రభావంతో మృతి చెందిన మొదటి వ్యక్తి 74 ఏళ్ల వృద్దుడు. కాగా అతని మరణ వార్తను అయినవారికి సమాచారం ఇచ్చినప్పటికీ బంధువులు ఎవరూ హాజరు కాలేదు.
ప్రస్తుత సమయంలో గుంపులుగా ఉంటేనే కరోనా వ్యాపిస్తుందేమో అన్న భయంతో ప్రజలు ఉన్నారు. కానీ ఈ వృద్దుడు కరోనా కారణంగా చనిపోయాడు అని తెలియగానే మృత దేహాన్ని చివరిసారి చూడటానికి ఐన వాల్లు, బంధువులు ఎవరూ అంత్యక్రియలకు హాజరు కాలేదు. దీంతో హెల్త్ వర్కర్లు దగ్గరుండి అతని చేసారు. ఈ నెల 14వ తేదీన ఈ వృద్దుడు మతపరమైన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లాడు. తిరగి 17న వచ్చారు. సరిగ్గా మూడు రోజుల తరువాత అంటే 20వ తేదీన అతను శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు. దీంతో అతని కుటుంబ సభ్యులు అతన్ని ఆసుపత్రిలో చేర్పించారు.
కాగా అతని పరిస్థితి విషమించడంతో గత గురువారం రాత్రి అతను చనిపోయాడు. దీంతో మృతదేహాన్ని కుటుంబ సభ్యులు ఆరోగ్య శాఖ సూచనల మేరకు సైఫాబాద్ పోలీసుల సహాయంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇక మృతి చెందిన వృద్దుని రక్త నమూనాలను పరిశీంచగా అతనికి కరోనా సోకిందని అతను చనిపోయిన తరువాత రిపోర్టుల వచ్చాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో మృతుడి కుటుంబ సభ్యులను ప్రస్తుతం ప్రభుత్వం క్వారంటైన్లో ఉంచడంతోపాటూ వృద్దుడి అంత్యక్రియలకు కేవలం 20 మందిని మాత్రమే అనుమతించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more