దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోడీ.. యావత్ దేశం జనతా కర్య్పూను పాటించిన మార్చి 22న ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అడపాదడపా అక్కడక్కడా కొందురు ఈ లాక్ డౌన్ అమలును పాటించడం లేదన్న విషయం కూడా వెలుగులోకి రావడంతో కేంద్ర పారామిలిటరీ బలగాలను కూడా రంగంలోకి దింపి మరీ అమలు చేస్తున్నారు. ప్రజారోగ్యం పరిరక్షించబడాలంటే.. దేశ ప్రజలందరూ ఇళ్లకు మాత్రమే పరిమితం కావాలని కూడా ఆయన పిలుపునిచ్చిన విషయం విధితమే.
అయితే ఇళ్లకుమాత్రమే దేశప్రజలు పరిమితమైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశ ఆర్థిక స్థితిని గాడినపెట్టడంతో పాటు కరోనా ప్రభావంతో కూడా చతికిలపడిన నేపథ్యంలో సామాన్యలతో పాటు పేద బి, మధ్య తరగతి వర్గాలకు మేలు కలిగే విధంగా ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించిన విషయం తెలిపిందే. అయితే ఈ ఉద్దీపన పథకలను ప్రకటించిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారమన్, సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ తో కలసి ప్రకటించిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ కేవలం ఏప్రిల్ 14 వరకు మాత్రమే ప్రకటించినా.. ప్రజలు ఆర్థికంగా నిలదొక్కునేవరు ఉద్దీపన కల్పించింది.
అయితే ఈ ఉద్దీపన పథకాలను మూడు నెలల పాటు ప్రకటించారు. దీంతో అటు సేదల, మధ్యతరగతి, బీద, మహిళా సంఘాలు, కూలీలు, దినసరి వేతన కూలీలు, ప్రైవేటు ఉద్యోగులకు మూడు నెలల పాటు ఈ ప్యాకేజీలను వర్తింపజేసింద కేంద్రం. దీంతో ఏప్రీల్ 14తో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ముగిసిపోతున్నా.. కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తున్న క్రమంలో దీనిని మరోమారు పొడిగించే అవకాశాలు లేకపోలేదన్న ఊహాగానాలు కూడా తెరపైకి వచ్చాయి. దీనికి బలం చేకూర్చేలా కేంద్రప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపణ పథకాలను కూడా చూపుతూ అనేక ప్రచారాలు హల్ చల్ చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో కేంద్రప్రభుత్వం లాక్ డౌన్ పోడిగింపు వార్తలపై క్లారిటీ ఇచ్చింది. దేశంలో ఇప్పుడు విధించిన లాక్ డౌన్ దేశ ఆర్థిక వ్యవస్థపై తీరని ప్రభావాన్ని చూపుతుందని, అయినా ప్రజారోగ్యం నేపథ్యంలో తాము ఎంతో కఠిన నిర్ణయం తీసుకున్నామని చెప్పింది. అయితే లాక్ డౌన్ ను పోడగిస్తారన్న వార్తలను మాత్రం తోసిపుచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో దేశంలో విధించిన లాక్ డౌన్ పొడిగించే ప్రసక్తే లేదని చెప్పింది. ప్రజలపై విపరీతంగా పడే ఈ ప్రభావం నుంచి అందరూ గడ్డెక్కడానికి ఉద్దీపన పథకాలను మూడు నెలల పాటు ప్రకటించామే తప్ప లాక్ డౌన్ పోడిగించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more