యవత్ ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. వేలాది మంది ప్రజల ప్రాణాలను బలితీసుకుంటున్న ఈ మహమ్మారి మన దేశంలోనూ పంజా విసురుతోంది. ప్రారంభంలో మన దేశంలో గణనీయంగా అత్యత తక్కువ సంఖ్యలో నమోదైన కేసులు.. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన తరువాత కూడా అధిక సంఖ్యలో పెరగడం తీవ్ర అందోళన రేకెత్తించే అంశం. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 100పైగా కొత్త కేసులు నమోదయ్యాయని, కేవలం ఇవాళ ఉదయం నుంచి 10 గంటల వరకు 11 కేసులు నమోదవ్వడంపై కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అందోళన వ్యక్తం చేస్తోంది.
కరోనా కట్టడికి కేంద్రం చర్యలు తీసుకుంటోందని, దేశవ్యాప్తంగా వైద్య కేంద్రాల్లో మరో 10 వేల వెంటిలేటర్లు ఏర్పాటు చేస్తున్నట్టు ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. భారత్ లాక్ డౌన్ చేసి ప్రజారోగ్యం దృష్ట్యా ఎంతో కఠినమైన నిర్ణయాలు తీసుకున్నా దేశంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుండటంతో పాజిటివ్ కేసుల సంఖ్య 1170కి చేరింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో 30 మరణాలు సంభవించాయి. కరోనా వైరస్ తో మహారాష్ట్ర అత్యంత అధికంగా ప్రభావితం అవుతోంది. ఈ రాష్ట్రంలో ఇప్పటికే ఈ వైరస్ బాదిన పడి ఆరుగురు మృత్యువాత పడ్డారు. ఆ తరువాత ఐదరు మరణాలను నమోదు చేసుకున్న గుజరాత్ ప్రభావితమైంది.
ఈ రెండు రాష్ట్రాల తరువాత కర్ణాటక మూడు మరణాలను నమోదు చేయగా, మధ్యప్రదేశ్, ఢిల్లీ, వెస్ట్ బెంగాల్, జమ్మైకాశ్మీర్ రాష్ట్రాలలో రెండేసి నమరణాలు నమోదయ్యాయి. ఇక కేరళ, తెలంగాణ, తమిళనాడు, బిహార్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఒక్కో మరణం నమోదైంది. దీనికి తోడు మహారాష్ట్ర ఆ తరువాత కేరళ రాష్ట్రాల్లోని ప్రజలు అత్యధికంగా కరోనా వైరస్ ను బారినపడ్డారు. మహారాష్ట్రంలో 215 మంది, కేరళలో 202 మంది ఈ వైరస్ బారినపడగా, కేరళలో 83, తెలంగాణలో 79 కేసులు నమోదయ్యాయి. ఉత్తర్ ప్రదేశ్, ఢిల్లీలలో 72 మంది, గుజరాత్ లో 69 మంది ఈ వైరస్ బారిన పడ్డారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more