తెలంగాణలో లాక్ డౌన్ అమల్లో వుండగా, ఒక్కరోజులో పది పాజిటివ్ కేసులు నమోదైన క్రమంలో ఇది అందోళన కలిగించే అంశమని ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన 24 గంటల వ్యవధిలోనే తెలంగాణలో తొలి మరణం నమోదైంది. కరోనా వైరస్ బారిన పడి తెలంగాణ వ్యక్తి ఒకరు చనిపోయారు. అయితే, అతడు చనిపోయిన తర్వాత అతడి రిపోర్టులు వచ్చాయని, అందులో కరోనా పాజిటివ్ వచ్చిందని తెలంగాణ వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. ఖైరతాబాద్కు చెందిన 74 సంవత్సరాల వృద్ధుడు కరోనా వైరస్ బారినపడి చనిపోయినట్టు ఆయన తెలిపారు.
ఆరోగ్య సమస్యలతో కొన్ని రోజుల క్రితం ఓ ఆస్పత్రిలో చేరిన వ్యక్తి చనిపోయాడని, అయితే, ఆయన మరణించిన తర్వాత రిపోర్టులు వచ్చాయని, అయనకు కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయిందన్నారు. ఇక తెలంగాణలో ఈరోజు కొత్తగా ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు ఈటల రాజేందర్ తెలిపారు. ఈనెల 27 వరకు 59 మంది కరోనా పాజిటివ్ బాధితులు ఉండగా, ఈరోజు కొత్తగా మరో ఆరుగురికి కరోనా నిర్ధారణ అయిందని చెప్పారు. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 65కు పెరిగింది.
పాతబస్తీకి చెందిన ఒకే కుటుంబంలో ఆరుగురికి కరోనా వచ్చిందని, అలాగే, కుత్బుల్లాపూర్కు చెందిన ఓ కుటుంబంలో నలుగురికి కరోనా సోకిందని ఈటల రాజేందర్ తెలిపారు. నాలుగు కుటుంబాల్లో ఎక్కువ కేసులు నమోదైనట్టు ఈటల రాజేందర్ తెలిపారు. హైదరాబాద్ పాతబస్తీ, ఖైరతాబాద్ చింతల్ బస్తీ, కుత్బుల్లాపూర్, నాంపల్లికి చెందిన నాలుగు కుటుంబాలకు కరోనా వ్యాపించింది. విమానాశ్రయంలో పనిచేస్తున్న కొందరికి కూడా కరోనా వచ్చినట్టు మంత్రి తెలిపారు.
ఇక హైదరాబాద్లో రెడ్ జోన్లు అంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఈటల ఖండించారు. ఎక్కడ కూడా రెడ్ జోన్లు లాంటివి లేవని స్పష్టం చేశారు. ఈ మేరకు జరుగుతున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని కోరారు. ప్రజలు ప్రార్థనల కోసం కూడా బయటకు రావొద్దని ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. మసీదులకు రావొద్దని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కోరారు. ప్రజలకు ఎలాంటి అనుమానాలు ఉన్నా, వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more