ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. వేలాది మంది ప్రజల ప్రాణాలను ఇప్పటికే బలితీసుకున్న ఈ మహమ్మారి ప్రతీ రోజు వందల సంఖ్యలో ప్రాణాలను కబళించివేస్తోంది. అగ్రరాజ్యం అమెరికా మొదలు.. ఇటలీ, స్పెయిన్, ఇరాన్, చైనా అంటూ తేడా లేకుండా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేాలపై తన ప్రభావాన్ని చాటుతూ లక్షలాధి మందిని తన బారిన పడేట్టు చేస్తోంది. గత నెలలో మన దేశంలోకి వచ్చిన విదేశీయులతో పాటు విదేశాల నుంచి వచ్చిన స్వదేశీయుల ద్వారా ప్రవేశించిన ఈ వైరస్ మన దేశంలోనూ పంజా విసురుతోంది.
అయితే ఇది గత నెలలో ప్రవేశించినా.. గత రెండు నెలలుగా విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల ద్వారానే దేశంలోకి ప్రవేశించి ప్రబలుతుందని కేంద్ర అరోగ్యశాఖవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. విదేశీ ప్రయాణాలు చేసిన వారితో పాటు వీదేశీయులను సైతం గుర్తింది.. వారిపై నిఘా పర్యవేక్షణ ఏర్పాటు చేయాలని దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఇప్పటికే అదేశాలు జారీ చేసింది కేంద్రం. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య వత్యాసం వస్తున్న గణంకాలతో పెద్ద ఆపద ముంచుకొస్తుందా.? అన్న అందోళన సైతం కేంద్ర ఆరోగ్యశాఖ వర్గాలు అందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలావుండగా, దేశంలో కరోనా కేసుల సంఖ్య మరింత పెరిగింది. ఇప్పటివరకు 873 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. ఇప్పటివరకు దేశంలో 79 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దేశంలో 24 గంటల్లో కొత్తగా 149 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇక దేశం మొత్తం మీద 19 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. కాగా, కేరళలో కరోనా కేసుల సంఖ్య 176కు చేరింది. మహారాష్ట్రలో 162, కర్ణాటకలో 64, తెలంగాణలో 59 మందికి కరోనా సోకింది. ఆంధ్రప్రదేశ్లో 13 మంది కరోనా బాధితులున్నారు.
కేరళలో తొలి మరణం
కరోనా వైరస్తో కేరళలో తొలిమరణం సంభవించింది. కరోనా సోకిన 69ఏళ్ల వృద్ధుడు రాష్ట్రంలోని ఎర్నాకులం వైద్యకళాశాలలో ఈ ఉదయం మరణించినట్లు అక్కడి వైద్యాధికారులు ప్రకటించారు. అయితే దీన్ని కేంద్ర ప్రభుత్వం ధ్రువీకరించాల్సి ఉంది. ఎర్నాకులానికి చెందిన ఈ వ్యక్తి కొన్నిరోజుల క్రితమే దుబయి నుంచి భారత్ చేరుకున్నాడు. అనంతరం న్యుమోనియా లక్షణాలు ఉండడంతో మార్చి 22న స్థానిక ఆసుపత్రిలో చేరాడు. వైద్యపరీక్షలు నిర్వహించగా అతడికి కరోనా వైరస్ సోకినట్లు వెల్లడైంది.
అయితే బాధితుడికి ఇదివరకే గుండె సంబంధ సమస్యలతోపాటు అధిక రక్తపోటు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ సమయంలో కరోనా కూడా నిర్ధారణ కావడంతో పరిస్థితి విషమించి ఈరోజు ఉదయం మరణించాడని పేర్కొన్నారు. అనంతరం మృతదేహాన్ని అతని కుటుంబసభ్యులకు అప్పగించారు. ఇదిలాఉంటే, కేరళలో కరోనా తీవ్రత అధికంగా. ఇప్పటికే రాష్ట్రంలో 173 కేసులు నిర్ధారణ కాగా 11మంది మాత్రమే కోలుకున్నారు. తాజాగా ఒకరు మరణించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more