కరోనా వైరస్ వ్యాప్తితో తిరుమలలో టీటీడీ చరిత్రలోనే సంచలన నిర్ణయం తీసుకుంది. తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తున్న భక్తులపై టీటీడీ పాలకమండలి ఆంక్షలు విధించింది. ఇవాళ్టి నుంచి తిరుమల శ్రీవారి దర్శనాన్ని తాత్కాలికంగా నిలిపివేయనున్నారు. రేపటి నుంచి తిరుమలపై వున్న భక్తులందరినీ కొండ దిగువకు తిరుపతికి పంపించనున్నామని అధికారులు ఇప్పటికే ప్రకటించారు. తిరుమలకు చేరుకునే భక్తులను అలిపిరి నుంచే అధికారులు తిప్పి పంపిస్తున్నారు. తిరుమలకు చేరకునే అలిపిరి ఘాట్ రోడ్ మూసివేయాలని సిబ్బందికి అధికారులు ఆదేశించారు.
ఎగువ ఘాట్ రోడ్లో వాహన రాకపోకలు నిషేధించారు. ఇక తిరుమలకు చేరుకునే రెండు మెట్ల మార్గాలను కూడా అధికారులు మూసివేయించారు. తిరుమల కొండపై ఉన్న భక్తులను వెంటనే కిందకు వెళ్లిపోవాలని టీటీడీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. భక్తులు కిందికి వెళ్లేందుకు దిగువ ఘాట్ రోడ్ తెరిచి ఉంచింది. ఎక్కడిక్కడ వాహనాలను నిలిపివేశారు. శ్రీపాద మార్గం కూడా అధికారులు మూసివేశారు. కరోనా ఉధృతి నేపథ్యంలో టీటీడీ నుంచి అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉంది. తిరుమలలో కరోనా అనుమానిత వ్యక్తిని గుర్తించారు. ఒక బృందంతో కలిసి కొండపైకి వచ్చినట్టు తెలుస్తోంది.
దివాకర్ అనే భక్తుడు వారణాసిలోని విశ్వానాదుడి దర్శనం చేసుకుని అక్కడి నుంచి తిరుమల కొండకు చేరుకున్నాడు. తిరుమలకు రాగానే అతడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అతన్ని గుర్తించిన అధికారులు టీటీడీకి చెందిన ఆస్పత్రిలో ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించి తిరుపతిలోని సిమ్స్కు తరలించగా.. అక్కడి ఐసోలేషన్ వార్డులో బాధితుడికి వైద్యులు చికిత్సను అందిస్తున్నారు. కరోనా లక్షణాలతో బాధపడుతున్న వ్యక్తిని గుర్తించిన అనంతరం టీటీడీ వెంటనే ఆకస్మాత్తుగా ఎగువ ఘాట్ రోడ్డు మూసివేసింది. దీంతో ఆలయాన్ని కొన్ని రోజుల పాటు మూసివేయాలన్న నిర్ణయానికి టీటీడీ పాలకమండలి అధికారులు నిర్ణయానికి వచ్చారు. అత్యున్నత అధికారులంతా కూడా అత్యావసర సమావేశం నిర్వహించిన తరువాత ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more