మానవాళి మనుగడకు సవాల్ విసిరేలా విజృంభిస్తూ.. వేలాధి మంది ప్రాణాలను బలి తీసుకున్న మహమ్మారి కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం తరువాత అంతటి మహిమాన్విత ఫుణ్యక్షేత్రమైన షిరిడి సాయిబాబా మందిరం ఇవాళ మధ్యాహ్నం మూడు గంటల నుంచి మూసివేయబడుతోందని అధికారులు తెలిపారు. కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో భక్తలు మహారాష్ట్రలోని షిరిడీ సాయి మందిర దర్శనాన్ని వాయిదా వేసుకోవాలని గత ఆదివారం రోజునే షిరిడి సాయిబాబా సంస్థాన్ ట్రస్టు భక్తులకు విన్నవించింది.
కరోనా వైరస్ మహారాష్ట్రలో వేగంగా విస్తరిస్తుండడం.. తాజాగా ముంబైలోని కస్తూర్భా హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్న 64ఏళ్ల వృద్ధుడు కూడా మరణించిన నేపథ్యంలో ప్రభుత్వం సూచనల మేరకు షిరిడి సాయిబాబా సంస్థాన్ ట్రస్టు ఈ నిర్ణయం తీసుకుంది. షిరిడీలో ఎటువంటి వైరస్ సోకదని, అందుకు సాయిబాబా వేసిన ఊదే కారణమని.. ఈ ప్రాంతంలో ఏలాంటి మహమ్మారులు వచ్చినా సాయిబాబా వాటిని తరుముతారని సాయిభక్తులు విశ్వసిస్తున్నా.. ట్రస్ట్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా.. ట్రస్టు ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకోక తప్పదు.
మానవాళిపై పంజా విసురుతున్న కరోనా వైరస్ నేపథ్యంలో తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆలయం మూసి వేసి ఉంటుందని ట్రస్టు వెల్లడించింది. ఇప్పటికే మహారాష్ట్రలోని ప్రముఖ ఆలయాలు సిద్ధి వినాయక, ముంబా దేవి టెంపుల్స్ ను మూసివేసిన సంగతి తెలిసిందే. ముంబై సిద్ధి వినాయక ట్రస్ట్ సైతం రెండు రోజుల క్రితమే ఇలాంటి నిర్ణయాన్ని తీసుకుని భక్తులకు వెల్లడించింది. ఈ క్రమంలో సిద్ది వినాయక ఆలయాన్ని మూసివేస్తున్నట్టు ప్రకటించింది. పుణెలోని శ్రీమంత్ గణపతి మందిర్, ముంబైలోని ముంబాదేవి ఆలయాలను కూడా దేవాలయ కమిటీలు నిర్ణయం తీసుకుని ఆలయాలను తాత్కాలికంగా మూసివేశారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ దేవాలయాలు మూసివేసి ఉంటాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more