పుడమిపై మానవాళి మనుగడను ప్రశ్నార్థకంగా మారుస్తూ.. విజృంభిస్తున్న కరోనావైరస్ మహమ్మారి దేశవ్యాప్తంగా 125 మందిని పట్టి పీడిస్తోంది. ఈ వ్యాధి ఉద్భవించిన చైనాలోని వూహన్ నగరంలో.. వేలాధి మంది కబళించిన ఈ మహమ్మారి.. మనదేశంలోనూ మూడో వ్యక్తిని బలి తీసుకుంది. కరోనావైరస్ ఎంత కరుడుగట్టిందో ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న మరణాలు.. హృదయవిదారక ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. ఈ మధ్యకాలంలోనే భారత దేశానికి వచ్చిన ఈ మహమ్మారి.. దేశంలోనూ మరణమృదంగాన్ని మ్రోగిస్తోంది.
కరోనా ప్రభావం ఉష్ణవాతావరణం గల భారత్ పై అంత ఎక్కువగా వుండదని ఇప్పటికే అనేకమంది నిపుణులు చెబుతున్నా.. విదేశాల నుంచి వచ్చి ఇద్దరు వృద్దులను ఇప్పటికే బలి తీసుకుంది. తొలుత కర్ణాటకకు చెందిన 76 ఏళ్ల వృద్దుడిని బలి తీసుకున్న ఈ మహమ్మారి.. ఆ తరువాత ఢిల్లీలోని మరో 68 ఏళ్ల వృద్దురాలిని కూడా పొట్టన బెట్టుకుంది. తాజాగా మరో 64 ఏళ్ల వృద్దుడిని కూడా కబళించివేసింది.కరోనావైరస్ సోకడంతో అసువులు బాసిన మూడో ఘటన దేశ ఆర్థిక రాజధాని ముంబైలో నమోదైంది.
ముంబైలోని కస్తూర్భా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న 64ఏళ్ల వృద్ధుడు ఇవాళ ఉదయం ప్రాణాలు కోల్పోయినట్లు హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. భారత్లో కరోనా సోకి మరణించిన వారిసంఖ్య 3కి చేరింది. గతవారంలో కర్ణాటకలోని కలబుర్గికి చెందిన ఓ వృద్ధుడు,ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి కరోనా సోకి మరణించిన విషయం తెలిసిందే. చాపకింద నీరులా దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఇక దేశంలో కరోనా వైరస్ తన ప్రాబల్యం చాటుకుంటోంది. మహారాష్ట్రలో అత్యధికంగా 39 కేసులు నమోదు అయ్యాయి. ఆ తరువాతి స్థానంలో కేరళలో విజృంభిస్తోంది.
ఇక విశ్వవ్యాప్తంగా కోవిడ్-19 మరణాల సంఖ్య 7వేలు దాటింది. మరో లక్షా 80వేల మంది ఈ వైరస్ సోకడంతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా క్రితం రోజున 157 దేశాలకు మాత్రమే విస్తరించిన ఈ వైరస్.. ఇవాళ 162 దేశాలకు కరోనా వైరస్ పాకింది. అత్యధికంగా చైనాలో కరోనా మరణాలు సంభవించాయి. చైనా తర్వాత స్థానంలో ఇటలీ, ఇరాన్, స్పెయిన్, కువైట్, కొరియా దేశాల్లో కరోనా మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇప్పటికే ప్రపంచదేశాలన్నింటినీ అప్రమత్తం చేసిన ప్రపంచ అరోగ్య సంస్థ.. కరోనా కట్టడికి పలు సూచనలను కూడా జారీచేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more